
జొన్న కొనుగోళ్లు నిలిపివేత..
భైంసాటౌన్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన జొన్న కొనుగోలు కేంద్రాలు పలుచోట్ల మూసివేయడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ముధోల్కు చెందిన రాజేశ్వర్ రావు దేశాయ్ అనే రైతు జొన్నలు విక్రయించేందుకు ఈనెల 23న టోకెన్ తీసుకున్నాడు. వర్షాలు కురవడంతో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు సోమవారం తీసుకురావాలని సూచించగా మాటేగాంలోని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. కేంద్రం మూసి ఉండడంతో నిర్వాహకులను ఫోన్లో సంప్రదించాడు. విషయం తెలుసుకున్న ‘సాక్షి’ అక్కడికి చేరుకుని మార్క్ఫెడ్ డీఎం ప్రవీణ్కుమార్ను ఫోన్లో సంప్రదించగా కుంటాలలోని కేంద్రానికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో సదరు రైతు కుంటాల కొనుగోలు కేంద్రంలో జొన్నలు విక్రయించాడు. ‘సాక్షి’ చొరవతో జొన్నలు కొనుగోలు చేయడంతో రైతు కృతజ్ఞతలు తెలిపాడు.