
వైఎస్సార్సీపీ రాష్ట్ర అనుబంధ కమిటీల్లో చోటు
బొమ్మలసత్రం: వైఎస్సార్సీపీ రాష్ట్ర అనుబంధ కమిటీలో నంద్యాల జిల్లాకు చెందిన ఆరుగురికి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థానం కల్పించారు. డోన్ నియోజకవర్గానికి చెందిన బోరా మల్లికార్జున రెడ్డికి స్టేట్ బూత్ కమిటీ వింగ్ సెక్రటరీగా, గుండ జయచంద్రకు స్టేట్ ఇంటలెక్చవల్స్ ఫోరమ్ జాయింట్ సెక్రటరీగా, మేకల బాలయ్యకు స్టేట్ పబ్లిసిటీ వింగ్ సెక్రటరీగా ఎన్నుకున్నారు. బనగానపల్లె నియోజకవర్గానికి చెందిన పీ కిషోర్కుమార్ గౌడ్ను స్టేట్ బూత్ కమిటీస్ వింగ్ సెక్రటరీగా, కునుకుంట్ల రమణను స్టేట్ పబ్లిసిటీ వింగ్ సెక్రటరీగా నియమించారు. అలాగే పాణ్యం నియోజకవర్గానికి చెందిన జెట్టి ప్రభుదాస్ను స్టేట్ దివ్యాంగుల విభాగం జనరల్ సెక్రటరీగా నియమించారు.