
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలి
ఫ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
దేవరకొండ : దేవరకొండ నియోజకవర్గ పరిధిలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్సీ, సీపీఐ జిల్లా కార్యదర్శి సత్యం కోరారు. మంగళవారం దేవరకొండ మండలం గొట్టిముక్కలలో నిర్వహించిన సీపీఐ మండల 14వ మండల మహాసభలో సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడు పల్లా వెంకట్రెడ్డితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలో నకిలీ విత్తనాలు అరికట్టి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థుల గెలుపునకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పల్లా వెంకట్రెడ్డి మాట్లాడుతూ ఓట్లు, సీట్లతో సంబంధం లేకుండా ప్రజా సమస్యలే అజెండాగా సీపీఐ నిరంతరం పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నర్సింహ్మారెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కలకొండ కాంతయ్య, పల్లె నరసింహ, రమావత్ అంజయ్యనాయక్, దేప సుదర్శన్రెడ్డి, నూనె రామస్వామి, వలమల్ల ఆంజనేయులు, పల్లా సులోచన, పల్లా రంగారెడ్డి, యాదయ్య పాల్గొన్నారు.