
బియ్యం కోసం బారులు
ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి ఇస్తుండటంతో సంగారెడ్డిలో బియ్యం తీసుకోవడానికి జనం బారులు తీరారు. తమవంతు ఎప్పుడు వస్తుందోనని గంటల తరబడి క్యూలో వేచి ఉంటున్నారు. బియ్యం తీసుకోవడానికి వచ్చినవారు మూడుసార్లు వేలిముద్ర ఇవ్వాల్సి రావడంతో రోజంతా నిరీక్షించాల్సి వస్తోందని వాపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో ఎండవేడి, ఉక్కపోత భరించలేక చిన్న పిల్లల తల్లులు, వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. కొన్నిచోట్ల బియ్యం త్వరగా తీసుకోవాలనే ఆతృతలో ‘‘నేను ముందు వచ్చాను అంటే నేను ముందు వచ్చాను’’అని కొట్లాడుకున్నారు. కొన్ని రేషన్ దుకాణాల వద్ద మంగళవారం కనిపించిన దృశ్యాలను ‘సాక్షి’క్లిక్మనిపించింది. –సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్ , సంగారెడ్డి