అర్హులందరికీ సంక్షేమ ఫలాలు | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

Jun 4 2025 8:33 AM | Updated on Jun 4 2025 4:39 PM

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

సంగారెడ్డి జోన్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతీ ఒక్కరికి అందేవిధంగా చూడాలని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వివిధ శాఖల అధికారులతో మంగళ వారం జిల్లా పరిషత్తు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ..ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలన్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు రహదారులు ముఖ్యం అని, రహదారులు అనుసంధానం చేస్తే విద్య ఉపాధి మార్గాలు పెరుగుతాయని చెప్పారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో మందులు నిల్వ ఉంచాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో ఇసుక కొరత లేదని తేల్చి చెప్పారు. సమీక్షలో అదనపు కలెక్టరు చంద్రశేఖర్‌, మాధురి, జెడ్పీసీఈఓ జానకి రెడ్డి పాల్గొన్నారు.

మంత్రి దామోదర రాజనర్సింహ

సంక్షేమ పథకాలపై అధికారులతో సమీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement