సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

Jun 4 2025 8:33 AM | Updated on Jun 4 2025 4:39 PM

సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

అదనపు కలెక్టర్‌ నగేశ్‌

నర్సాపూర్‌ రూరల్‌/పాపన్నపేట(మెదక్‌)/హవే ళిఘనపూర్‌(మెదక్‌): భూ సమస్యలున్న ప్రతీ ఒక్కరు భూ భారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ నగేశ్‌ సూచించారు. మండలంలోని మంతూర్‌, గొల్లపల్లి, పాపన్నపేట మండలం ముద్దాపూర్‌ , మెదక్‌ మండలం పేరూర్‌ గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎవరికై నా భూ సమస్యలు ఉండే రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారి కోసమే ఈ సదస్సులు ఏర్పాటు చేసిందని తెలిపారు. రైతులు తమ భూములకు సంబంధించి ఇచ్చిన ఫిర్యాదులపై తహసీల్దార్‌ విచారణ జరిపి,తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. అక్కడ పరిష్కారం లభించక పోతే ఆర్డీఓకు, ఆపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. మంతూర్‌లో 57, గొల్లపల్లిలో 47, ముద్దాపూర్‌, కొంపల్లి గ్రామాల్లో 68 భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులను అధికారులు స్వీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement