గణితంలో ప్రతిభ చాటాలి | - | Sakshi
Sakshi News home page

గణితంలో ప్రతిభ చాటాలి

Dec 12 2024 8:58 AM | Updated on Dec 12 2024 8:59 AM

ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి

గజ్వేల్‌: గణితంలో విద్యార్థులు ప్రతిభను చాటుకోవాలని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం తెలంగాణ గణిత ఫోరమ్‌(టీఎంఎఫ్‌) ఆధ్వర్యంలో గజ్వే ల్‌ మండలం కొడకండ్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి గణిత టాలెంట్‌ టెస్ట్‌ నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు గణితం సబ్జెక్ట్‌ కీలకమని చెప్పారు. తె లుగు మీడియం పాఠశాలలకు సంబంధించి మొదటి స్థానాన్ని కే.భువన( చీకోడ్‌), రెండోస్థానాన్ని మమత(భూంపల్లి) దక్కించుకున్నా రు. దీక్ష(వడ్డేపల్లి) మూడోస్థానంలో నిలి చారు. ఇంగ్లిష్‌ మీడియంకు సంబంధించి మొ దటి బహుమతిని వంశీ తేజ (ఇంద్రానగర్‌–సిద్దిపేట), రెండో బహుమతిని సౌమ్య(జక్కాపూర్‌), మూడో బహుమతిని అన్వేష్‌(జక్కాపూర్‌)లు పొందారు. మోడల్‌ స్కూళ్ల విభాగంలో మొదటి స్థానాన్ని సాత్విక్‌రెడ్డి (హుస్నాబాద్‌), రెండోస్థానాన్ని ప్రణవి (చింతమడక), మూడోస్థానాన్ని సూర్యతేజ(ఇర్కోడు)లు కై వసం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement