
వన దుర్గమ్మా.. చల్లంగా దీవించమ్మా
ఏడుపాయల పుణ్యక్షేత్రం వారాంతపు సెల వు ఆదివారం వేలాది భక్తులతో జనారణ్యంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు బోనాలు తీసి ఒడి బియ్యం స మర్పించారు. అమ్మవారికి మొక్కులు చెల్లించి తరలించారు. అర్చకులు వన దుర్గమ్మను అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఈఓ చంద్రశేఖర్, సిబ్బంది, పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఆలయ పరిసరాలు దుర్గమ్మ నామస్మరణ తో మారుమోగాయి.
– పాపన్నపేట(మెదక్)