కాజీపేట నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్ల సర్వీస్‌లు | - | Sakshi
Sakshi News home page

కాజీపేట నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్ల సర్వీస్‌లు

May 2 2025 12:43 AM | Updated on May 2 2025 12:43 AM

కాజీపేట నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్ల సర్వీస్‌లు

కాజీపేట నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్ల సర్వీస్‌లు

మే, జూన్‌లో నడిపించనున్న రైల్వే..

కాజీపేట రూరల్‌: దక్షిణ మధ్య రైల్వే అధికా రులు కాజీపేట జంక్షన్‌ నుంచి తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రానికి ప్రయాణికులు, భక్తుల కోసం వేసవిని పురస్కరించుకొని ప్రత్యేక రైళ్ల సర్వీస్‌లను ప్రవేశపెట్టి నడిపించనున్నట్లు రైల్వే అధికారులు గురువారం రాత్రి తెలిపారు.

ప్రత్యేక రైళ్ల వివరాలు

కాజీపేట–తిరుపతి (07253) వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ ప్రతి మంగళవారం మే 6, 13, 20, 27, జూన్‌ 3, 10, 17, 24వ తేదీల్లో కాజీపేట నుంచి 13:30 గంటలకు బయల్దేరి మరుసటి రోజు 09:40 గంటలకు చేరుతుంది. అదేవిధంగా తిరుపతి–కాజీపేట (07254)వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ మే 6, 13, 20, 27, జూన్‌ 4, 11, 18, 25వ తేదీల్లో ప్రతి బుధవారం తిరుపతిలో 12:30 గంటలకు బయల్దేరి మరుసటి రోజు కాజీపేటకు 08:00 గంటలకు చేరుతుంది. ఈ సర్వీస్‌లకు జనగా మ, భువనగిరి, చర్లపల్లి, సనత్‌నగర్‌, లింగంపల్లి, వికారాబాద్‌, తాండూర్‌, సేడెమ్‌, సులేహలి వెస్ట్‌, యాద్గిరి, కృష్ణా, రాయచూర్‌, మంత్రాలయం రోడ్‌, ఆదోని, గుంతకల్‌, గూటి, తాడిపత్రి, కడప, రాజ్‌పేట, కోడూరు, రేణిగుంట స్టేషన్లలో హాల్టింగ్‌ అవకాశం కల్పించారు.

కేయూలో యథావిధిగా హాస్టల్స్‌, మెస్‌లు

కేయూ క్యాంపస్‌: అలుమనాక్‌ ప్రకారం కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులకు మే 1 నుంచి అధికారులు సెలవులు ప్రకటించారు. అయితే పీజీ కోర్సుల ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు మాత్రం తమకు పోటీ పరీక్షలున్నాయని యఽథావిధిగా హాస్టళ్లు, మెస్‌లను కొనసాగించాలని ఇటీవల ఆందోళన చేశారు. దీంతో హాస్టల్స్‌, మెస్‌లను యధావిధిగా కొనసాగిస్తున్నారు. గురువారం కేయూ రిజిస్ట్రార్‌ ఆచార్య రామచంద్రం యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపా ల్‌, వివిధ విభాగాల అధిపతులతో అకాడమిక్‌ కమిటీహాల్‌లో సమావేశం నిర్వహించారు. పీజీ కోర్సుల ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థుల కోసం హాస్ట ళ్లు, మెస్‌లను కొనసాగిస్తున్నందున వారికి నా ల్గవ సెమిస్టర్‌ పరీక్షలు ఈనెలలో నిర్వహించా లనే అంశం చర్చకు వచ్చిందని సమాచారం. కానీ, జూన్‌ 6వ తేదీ నుంచి పీజీ కోర్సుల నాల్గ వ సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించేందుకు టైంటేబుల్‌ ప్రకటించారు. ఈనెల 2న కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి వచ్చాక సమావేశం నిర్వహించి తుదినిర్ణయం తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చి నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. సెలవులు ఇ చ్చినప్పటికీ హాస్టల్‌, మెస్‌ సదుపాయం కల్పించాలని సుమారు 149మంది పీజీ కోర్సుల ఫస్టియర్‌ విద్యార్థులు సంబంధిత అధికారులను కోరారు. వారికి కూడా అవకాశం ఇచ్చినట్లు కేయూ హాస్టళ్ల డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ తెలిపారు. ఇంజనీరింగ్‌ కళాశాల, ఫార్మసీ కళాశాల, లా కళాశాల విద్యార్థుల హాస్టళ్ల మెస్‌లను మూసివేసినట్లు డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ తెలిపారు. ఇదిలా ఉండగా బీఈ డీ, ఎంఈడీ కోర్సుల విద్యార్థులకు హాస్టళ్లలో, మెస్‌ సదుపాయం యధావిధిగా కొనసాగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement