
ఉద్యోగం పేరుతో మోసం
● ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడు
● పీజీఆర్ఎస్కు 58 ఫిర్యాదులు
కర్నూలు: రైల్వే శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి హైదరాబాద్కు చెందిన విజయభాస్కర్ రూ.7 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఎస్పీ విక్రాంత్ పాటిల్కు కర్నూలుకు చెందిన దినేష్ నాయుడు ఫిర్యాదు చేశారు. కర్నూలు రెండో పట్టణ పోలీస్స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించి నేరుగా వారితో ఎస్నీప మాట్లాడారు. మొత్తం 58 ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నిటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. పీజీఆర్ఎస్లో పాల్గొని అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.