భీం త్యాగానికి గౌరవం | - | Sakshi
Sakshi News home page

భీం త్యాగానికి గౌరవం

Oct 7 2025 4:25 AM | Updated on Oct 7 2025 4:25 AM

భీం త

భీం త్యాగానికి గౌరవం

వర్ధంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన ప్రభుత్వం జోడేఘాట్‌లో నేడు కార్యక్రమాలు.. ముస్తాబైన వీరుడి పోరుగడ్డ హాజరు కానున్న రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు జిల్లాలోని విద్యా సంస్థలకు నేడు సెలవు

కెరమెరి(ఆసిఫాబాద్‌): నిజాం సర్కారుకు వ్యతిరేకంగా, ఆదివాసీల హక్కుల కోసం ప్రాణాలర్పించిన భీం త్యాగాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. జల్‌.. జంగల్‌.. జమీన్‌.. నినాదంతో పోరాడి అమరుడైన కుమురంభీం వర్ధంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కెరమెరి మండలం జోడేఘాట్‌లో మంగళవారం భీం వర్ధంతి అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివాసీల సంప్రదాయం ప్రకారం నివాళులర్పించనున్నారు. ఉదయం 8 గంటలకు జెండాలు ఆవిష్కరించనున్నారు. 9 గంటలకు సమాధి వద్ద పూజలు చేసి, 10 గంటలకు శ్రద్ధాంజలి ఘటించనున్నారు. ఇప్పటికే కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా, ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ ఏర్పాట్లు పరిశీలించారు. భీం వర్ధంతి నేపథ్యంలో జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

హాజరు కానున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు

రాష్ట్ర ప్రభుత్వం భీం వర్ధంతిని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క, గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి హాజరు కానున్నారు. అలాగే ఎంపీ గోడం నగేశ్‌, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు నివాళులర్పించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో ప్రజాప్రతినిధులు కేవలం భీం విగ్రహం వద్ద శ్రద్ధాంజలి ఘటించి, పూజలకే పరిమితం కానున్నారు. ఆదివాసీలు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి సమస్యలు తీసుకెళ్లేందుకు ఏటా నిర్వహించే దర్బారు కోడ్‌ కారణంగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

జోడేఘాట్‌లోని కుమురంభీం విగ్రహం

భారీ బందోబస్తు

భీం త్యాగానికి గౌరవం1
1/2

భీం త్యాగానికి గౌరవం

భీం త్యాగానికి గౌరవం2
2/2

భీం త్యాగానికి గౌరవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement