
పదిలో మళ్లీ నిరాశ
● రాష్ట్రస్థాయిలో 32వ స్థానంలో జిల్లా ● 6,480 మంది విద్యార్థులకు 5,654 మంది పాస్ ● వందశాతం ఉత్తీర్ణత సాధించిన పలు పాఠశాలలు
ఆసిఫాబాద్రూరల్: పదో తరగతి ఫలితాల్లో జిల్లాకు మళ్లీ నిరాశే ఎదురైంది. బుధవారం విడుదలైన ఫలితాల్లో ఇతర జిల్లాలతో పోల్చితే వెనుకబడిపోయింది. గతేడాది రాష్ట్రస్థాయిలో 31వ స్థానంలో నిలవగా, 2024– 25 విద్యా సంవత్సరంలో జిల్లా 32వ స్థానానికి పడిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు పాఠశాలలకు సక్రమంగా హాజరు కాకపోవడం, రెగ్యులర్ డీఈవో లేకపోవడంతో ఆశించిన ఫలితాలు రాలేదు. పాఠశాలలపై పర్యవేక్షణ లేకపోవడం కూడా కారణమని తెలుస్తోంది. కొన్నేళ్లుగా ఇలాంటి ఫలితాలే పునరావృతమవుతున్నా.. విద్యాశాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. రానున్న విద్యా సంవత్సరంలోనైనా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.
5,654 మంది ఉత్తీర్ణత
జిల్లావ్యాప్తంగా 170 ఉన్నత పాఠశాలలు ఉండగా, 6,480 మంది విద్యార్థులు పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 5,654 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 3,035 మంది బాలురు పరీక్షలు రాయగా, 2,539 మంది(83.66 శాతం) ఉత్తీర్ణత సాధించగా, 3,445 మంది బాలికలకు 3,115 మంది(90.42) పాసయ్యారు.
సత్తా చాటిన ‘ప్రభుత్వ’ విద్యార్థులు
పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, గురుకులాలు, కస్తూరిబా గాంధీ విద్యాలయాలు, మోడల్ స్కూళ్లు, గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు ముందంజలో నిలిచారు. ఇక్కడ 99 మందికి 96 మంది ఉత్తీ ర్ణత నమోదు చేశారు. వర్షిత్ 600మార్కులకు 564 సాధించి టాపర్గా నిలవగా, సైయాద్ ఉమేజ నజ్ 561 మార్కులు సాధించారు. స్థానిక మహాత్మా జ్యోతిబా పూలే బాలుర పాఠశాలలో 70 మందికి 96 మంది పాసయ్యారు. వరుణ్ 561 మార్కులు, కార్తీక్ 543 మార్కులు సాధించారు. జ్యోతిబా పూలే బాలికల పాఠశాలలో 69 మందికి 68 ఉత్తీర్ణులు కా గా, లిఖిత 556, అశ్విని 553 మార్కులతో స్కూల్ టాపర్లుగా నిలిచారు. గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో 73 మందికి 72 మంది ఉత్తీర్ణత సాధించగా, అక్కిరెడ్డి ఐశ్వర్య 553, మాయావతి 552, కీర్తన 540 మార్కులు పొందారు. బాలుర సాంఘిక సంక్షేమ గురుకులంలో 75 మందికి 73 ఉత్తీర్ణులు కాగా, వంశీ 560, రోహన్ 541 మార్కులు సాధించారు. ఆసిఫాబాద్ కేజీబీవీలో 42 మందికి 41 మంది, ఆసిఫాబాద్ బాలికల ఉన్నత పాఠశాలలో 102 మంది 84 మంది పాసయ్యారు. బాలికల ఉన్నత పాఠశాలలో సాత్విక 541, తేజశ్విని 522 మార్కులతో టాపర్లుగా నిలిచారు. బాలుర ఉన్నత పాఠశాలలో 94 మందికి 69 మంది, జన్కాపూర్ పాఠశాలలో 71 మందికి 59 మంది ఉత్తీర్ణులయ్యారు. మర్యాదాస్ 519, శంకర్ 511 మార్కులు సాధించారు. బూర్గుడ పాఠశాలలో 74 మందికి 55 మంది ఉత్తీర్ణులు కాగా, 487 మార్కులతో ఉమేష్, 476 మార్కులతో సాయివర్షిణి టాపర్లుగా నిలిచారు.
ఇక్కడ వంద శాతం ఉత్తీర్ణత
జిల్లాలోని పలు పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి. కెరమెరి మండలంలోని మోడి కేజీబీవీలో 16 మంది 16 మంది, మోడి ఉన్నత పాఠశాలలో 9 మంది 9 మంది, గోయగాం ఉన్నత పాఠశాలలో 35 మందికి 35 మంది, జైనూర్ కేజీబీవీలో 35 మందికి 35 మంది, చింతలమానెపల్లి మండలం డబ్బా ఉన్నత పాఠశాలలో 12 మందికి 12 మంది, బాబాపూర్ ఉన్నత పాఠశాలలో ఆరుగురికి ఆరుగురు, రెబ్బెన మండలంలోని తుంగెడ ఉన్నత పాఠశాలలో 16 మందికి 16 మంది, వాంకిడి కేజీబీవీలో 38 మందికి 38 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
నాలుగేళ్లుగా పదో తరగతి ఫలితాలు ఇలా..
విద్యా సంవత్సరం విద్యార్థులు ఉత్తీర్ణత శాతం రాష్ట్రస్థాయిలో స్థానం
2021–22 7,007 5,605 79 32
2022– 23 6,670 5,061 75 30
2023– 24 6,393 5,325 83 31
2024– 25 6,480 5,654 87 32

పదిలో మళ్లీ నిరాశ

పదిలో మళ్లీ నిరాశ

పదిలో మళ్లీ నిరాశ

పదిలో మళ్లీ నిరాశ

పదిలో మళ్లీ నిరాశ

పదిలో మళ్లీ నిరాశ

పదిలో మళ్లీ నిరాశ