
‘పల్లెల అభివృద్ధే ధ్యేయం’
బెజ్జూర్: మారుమూల పల్లెల అభివృద్ధే ప్రభు త్వ ధ్యేయమని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నా రు. మండలంలోని కొర్తగూడలో సోమవారం గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. త్వరలో ఇందిరమ్మ ఇళ్లు, యువతకు ఉద్యోగాలు, రాజీవ్ యువ వికా సంతో రుణాలను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. అనంతరం పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన రోడ్డు పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి, టీపీసీసీ మెంబర్ అర్షద్ హుస్సేన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీవర్ధన్, నాయకులు జగ్గాగౌడ్, విశ్వేశ్వర్, శ్రీనివాస్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.