
పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు
ఆసిఫాబాద్: స్థానిక సంస్థల గెలుపు కోసం సైనికు ల్లా పని చేయాలని, పని చేసే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియా జ్ అహ్మద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్లో ఆదివారం డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు అధ్యక్షతన నిర్వహించిన భారత్ సంవిధాన్ బచావో సభకు ఎమ్మెల్సీ దండె విఠల్తో కలిసి హాజ రయ్యారు. ఆయన మాట్లాడుతూ రాజకీయ, ఆర్థిక సమానత్వం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని, పార్టీ అభివృద్ధి కోసం గ్రామ కమిటీలు వేయనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుందని, పార్టీలో జరిగే ప్రతీ విష యం కార్యకర్తలలకు తెలియజేస్తామన్నారు. ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పా లనలో అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. జిల్లావాసులకు ప్రాణాధారమైన అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేస్తామ ని తెలిపారు. పెద్దపల్లి గ్రంథాలయ చైర్మన్ అన్నయ్యగౌడ్ మాట్లాడుతూ కమిటీల్లో అవకాశం ఇచ్చిన నాయకులు సమావేశాలకు హాజరు కాకుంటే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పీసీసీ అధ్యక్షుడు సూచించారని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు మాట్లాడుతూ నియోజకవర్గ, మండలస్థాయి సమావేశాలు నిర్వహించి పార్టీ అభివృద్ధి కోసం నిర్వహించే కార్యక్రమాలు గురించి దిశానిర్దేశం చేస్తామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ కార్యకర్తలు సంక్షేమ పథకాల్లో వాటా మాత్రమే అడుగుతున్నారని, వాటిని అందించాల్సిన బాధ్యత నాయకులపై ఉందన్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీరా శ్యాంనాయక్ మాట్లాడుతూ మాట వినకుంటే అధికారులను సర్వీస్ నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. సమావేశంలో మాజీ ఎంపీపీ బాలేశ్గౌడ్, ఎస్సీ సెల్ జిల్లా నాయకుడు వసంత్రావు, కాంగ్రెస్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు గుండ శ్యామ్, మాజీ జెడ్పీ చైర్మన్ గణపతి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేశ్, మైనార్టీ నాయకుడు మునీర్ అహ్మద్, మండలాల అధ్యక్షుడు, నాయకులు పాల్గొన్నారు.
● రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ అహ్మద్