
సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలి
కొత్తపల్లి(కరీంనగర్): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పించాలని జిల్లా వైద్యా ఆరోగ్య శాఖాధికారి వెంటకరమణ అన్నారు. కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం జరిగిన ఆశ డే కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. సీవై– టీబీ టెస్ట్ మైకో బ్యాక్టీరియం టుబర్కులోసిస్ అంటిజెన్ ఆధారిత చర్మ పరీక్షలను ప్రారంభించారు. హాజరుపట్టిక, రికార్డులు, లేబర్ రూం, ఆపరేషన్ థియేటర్ను పరిశీలించారు. అనంతరం డీఎంహెచ్వో మాట్లాడుతూ... పీహెచ్సీలో సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగేలా చూడాలన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉంటూ ముందస్తు జాగ్రత్తలు తీసుకో వాలని సూచించారు. అంతకుముందు ఆసిఫ్నగర్ వెల్నెస్ సెంటర్ను సందర్శించారు. కార్యక్రమంలో ఎంసీహెచ్ పీవో సన జవేరియా, వైద్యాధికారులు డాక్టర్ వనజ, డాక్టర్ శ్రావిక, వైద్యసిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
కరీంనగర్: ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో మొదటి దఫా ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ కె.అశోక్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, డ్రాప్ట్స్మన్ సివిల్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, డ్రెస్ మేకింగ్, వెల్డర్, మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, టెక్నిషియన్ స్మార్ట్ అగ్రికల్చర్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. వెబ్సైట్ httpr://iti.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 21 లోగా రూ.100 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు.
పవర్కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ నిర్వహణ పనులు చేపడుతున్నందున బుధవారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు 11 కేవీ హౌసింగ్ బోర్డు, సాయికృష్ణ ఫీడర్ల పరిధిలోని హౌసింగ్బోర్డుకాలనీ, విట్స్ కళాశాల, సుభాష్ విగ్రహం, మారుతీనగర్, బొమ్మకల్ రోడ్, వాటర్ ట్యాంక్, ముకరంపుర, తెలంగాణచౌక్, భగత్నగర్, మున్సిపల్ కార్యాలయం, జెడ్పీ ఆఫీసు ఏరియాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–1, 2 ఏడీఈలు పి.శ్రీనివాస్గౌడ్, ఎం.లావణ్య తెలిపారు.
కమాన్పూర్ ఎక్స్ప్రెస్ ఫీడర్ పరిధిలో..
విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు, విద్యుత్ స్తంభాల మార్పు పనులు చేపడుతున్నందున బుధవారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 33/11 కేవీ శాతవాహన సబ్స్టేషన్ కమాన్పూర్ ఎక్స్ప్రెస్ ఫీడర్ పరిధిలోని చింతకుంట, కమాన్పూర్(పాక్షికం), గ్రానైట్ పరిశ్రమల ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు.
ట్యాంకర్ల రేట్లపై ఇన్చార్జి కమిషనర్ సీరియస్
కరీంనగర్ కార్పొరేషన్: ప్రైవేట్ ట్యాంకర్లకు సంబంధించి నగరపాలకసంస్థలో ఒక్కో ట్యాంకర్కు ఒక్కోరేటు వసూలు చేస్తుండడంపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఇన్చార్జి కమిషనర్ ప్రపుల్ దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘ఇంతకీ ఏ రేటు’ అనే శీర్షికన ఈ నెల 2వ తేదీన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను పిలిచి ట్యాంకర్ల వ్యవహారంపై ఆరా తీయడంతో పాటు, ప్రైవేట్ ట్యాంకర్లకు ఒకరికి రూ.200, మరొ కరు రూ.400 వసూలు చేయడమేమిటని ప్ర శ్నించినట్లు తెలిసింది. ట్యాంకర్ల రేట్లను వెంట నే సరిచేయాలని ఆదేశించినట్లు సమాచారం.