
సర్దుబాటు చర్యను విరమించుకోవాలి
కరీంనగర్: ప్రభుత్వం ఉపాధ్యాయుల సర్దుబాటును వెంటనే విరమించుకోవాలని టీపీటీఎఫ్ జి ల్లా అధ్యక్షుడు జంకె రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం సంఘ కార్యాలయంలో మాట్లాడుతూ ఉపాధ్యాయుల సర్దుబాటు పేరుతో ప్రాథమిక పాఠశాలలో 30మందికి ఒకరిని, 60మందికి ఇద్దరు ఉపాధ్యాయులను నియమిస్తే ఎలా బోధిస్తారని ప్రశ్నించారు. అసంబద్ధమైన ఉత్తర్వును వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. కామన్ స్కూల్ విద్యా విధానా న్ని ప్రవేశపెట్టాలని, ఈ వేసవిలోనే ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్లు చేపట్టి విద్యా వ్యవస్థ బలోపేతం చేయడానికి ప్రభుత్వం తగువి ధంగా తోడ్పడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకుల వేల్పుల బాలయ్య, అర్కాల శ్రీనివాస్,కిషన్రావు, రామస్వామి, శ్రీధర్, ఆంజనేయరావు, శ్రీనివాస్, చంద్రశేఖర్, రాజమల్లు పాల్గొన్నారు.