
ఇందిరమ్మ ఇళ్ల కోసం నిరసన
గురువారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2025
జమ్మికుంట: జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో అర్హులకు మొండిచేయి చూపారని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఇళ్ల ఎంపికలో ఇందిరమ్మ కమిటీ, కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారంగా జాబిత తయారు చేశారని బుధవారం జమ్మికుంట– ఉప్పల్ రోడ్డుపై బైఠాయించారు. జాబితాలో వచ్చిన పేర్లను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకుల బంధువులు, దగ్గరివారికి ఇచ్చుకున్నారని పంచాయతీ కార్యదర్శి అంజిరెడ్డితో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వానికి వ్య తిరేకంగా నినాదాలు చేశారు. ఎస్సై శేఖర్రెడ్డి ఆందోళనకారులతో మాట్లాడారు. నిబంధనల ప్రకారం రెండోవిడతకు దరఖాస్తు చేసుకోవాలని, ట్రాఫిక్కు అంతరాయం కలిగించవద్దని ఆందోళన విరమింపజేశారు.
న్యూస్రీల్

ఇందిరమ్మ ఇళ్ల కోసం నిరసన