
నేరాలు నియంత్రించాలి
తిమ్మాపూర్: నేరాలు నియంత్రణ దిశగా కృషి చేయాలని సీపీ గౌస్ ఆలం సూచించారు. మంగళవారం తిమ్మాపూర్ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో నేర సమీక్ష నిర్వహించారు. పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టంను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. సీసీసీ ఫిర్యాద్చులు త్వరితగతి న పరిష్కరించాలని సూచించారు. పోలీస్స్టేషన్లు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. రికార్డుల నిర్వహణ, కేసు వివరాలు నమోదు చేయాలని, పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను రికార్డుల్లో నమోదు చేసి, వేలం వే యడానికి చర్యలు తీసుకోవాలన్నారు. రిసెప్షన్, కోర్టుడ్యూటీ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, పెట్రోలింగ్ విధులు సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. రౌడీ, హిస్టరీ షీటర్లపై నిఘా ఏర్పా టు చేయాలని, గంజాయి, ఇసుక, పీడీఎస్ బి య్యం రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్, తిమ్మాపూర్ సీఐ జి.సదన్కుమార్, ఎస్సైలు, శిక్షణ ఎస్సైలు పాల్గొన్నారు.
● సీపీ గౌస్ఆలం