
జీపీవో పరీక్ష కేంద్రం తనిఖీ
కరీంనగర్ అర్బన్: కరీంనగర్ సప్తగిరికాలనీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన గ్రామ పాలన అధికారుల(జీపీవో) నియామక పరీక్షను కలెక్టర్ పమేలా సత్పతి ఆదివారం తనిఖీ చేశారు. గత ప్రభుత్వం రద్దు చేసిన వీఆర్వో, వీఆర్ఏలను తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకునేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జీపీవో పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వీఆర్వో, వీఆర్ఏలకు రాత పరీక్ష నిర్వహించారు. 189 మంది దరఖాస్తు చేసుకోగా 172మంది పరీక్షకు హాజరయ్యారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మికిరణ్, డీఆర్వో పవన్ కుమార్, ఆర్డీవో మహేశ్వర్, నెహ్రూ యువ కేంద్ర కోఆర్డి నేటర్ రాంబాబు, డీవైఎస్ఓ శ్రీనివాస్, ఏవో సుధాకర్ పర్యవేక్షించారు.
విద్యావ్యాప్తిని ఉద్యమంగా సాగిద్దాం
కరీంనగర్కల్చరల్: రాష్ట్రంలో విద్యావ్యాప్తిని ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని టీజీఈజేఏసీ చైర్మన్, టీఎన్జీవో అధ్యక్షుడు మారం జగదీశ్వర్ అన్నారు. జిల్లాకేంద్రంలో రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ నిర్వహించిన ఉద్యమ అధ్యయన తరగతులను ప్రారంభించి మాట్లాడారు. సమాజంలోని అన్నిరకాల సమస్యలకు ప్రధా న ఆటంకం విద్యావంతుల కొరతేనని, గుణా త్మకమైన విద్యను సాధించినప్పుడే రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందన్నారు. ఏపీటీఎఫ్ పూర్వ అధ్యక్షుడు సుబ్బారెడ్డి మా ట్లాడుతూ ప్రజా సమస్యలపై జరిగే ఉద్యమాల్లో ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్, ప్రధా న కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి, సంఘం చీఫ్ ప్యాట్రాన్ లక్కిరెడ్డి సంజీవరెడ్డి, రాష్ట్ర కన్వీనర్, విష్ణు మూర్తి, ఎస్.ప్రభాకర్ రావు, ఖాజా మంజూర్ అలీ, అశోక్రావు, కాసు మహేందర్రాజు, సలీం, సురేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలి
చిగురుమామిడి: ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను ఎన్కౌంటర్ చేయడం సరికాదని, సుప్రీంకోర్టు మాజీ ప్రధానన్యాయమూర్తితో విచారణ జరిపించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం చిగురుమామిడిలో మండల సహాయకార్యదర్శి బూడిద సదాశివ అధ్యక్షతన మండల కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొ ట్టాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నారు. సీపీఐ జిల్లా 23వ మహాసభలు ఈనెల 27,28 తేదీల్లో మధుగార్డెన్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందెస్వామి, బోయిని అశోక్, నాగెల్లి లక్ష్మారెడ్డి, చిన్నస్వామి పాల్గొన్నారు.
తెలంగాణ పల్లె గొంతుక అన్నవరం దేవేందర్
కరీంనగర్కల్చరల్: స్వచ్ఛమైన పల్లె కవిగా జీవించడం కవి అన్నవరం దేవేందర్ ప్రత్యేకత అని కేంద్ర సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యుడు ప్రసేన్ అన్నారు. కరీంనగర్ ఫిలింభవన్లో ఆదివారం కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ‘కవి సంధి’ కార్యక్రమంలో దేవేందర్ సాహిత్య కృషిని ప్రశంసించారు. ఇంటి భాషలో కవిత్వాన్ని, వచనాన్ని సమర్థవంతంగా సృజిస్తూ తెలంగాణ మట్టికవిగా ద శాబ్దాల క్రితమే గుర్తింపు పొందాడన్నారు. కవిగా, కాలమిస్టుగా, ఫ్రీ లాన్స్ జర్నలిస్టుగా దేవేందర్ బహుముఖ కృషిని గుర్తించి కేంద్ర సాహిత్య అకాడమీ ఆయన సాహిత్యంపై ‘కవి సంధి’ కార్యక్రమాన్ని కరీంనగర్లో నిర్వహిస్తోందన్నారు. నలిమెల భాస్కర్, జూకంటి జగన్నాథం, నగునూరి శేఖర్, బొద్దుల లక్ష్మయ్య, బీవీఎన్స్వామి, నాగభూషణం పాల్గొన్నారు.

జీపీవో పరీక్ష కేంద్రం తనిఖీ

జీపీవో పరీక్ష కేంద్రం తనిఖీ

జీపీవో పరీక్ష కేంద్రం తనిఖీ