భూ భారతి.. అర్జీల పురోగతి | - | Sakshi
Sakshi News home page

భూ భారతి.. అర్జీల పురోగతి

May 26 2025 9:56 AM | Updated on May 26 2025 9:56 AM

భూ భారతి.. అర్జీల పురోగతి

భూ భారతి.. అర్జీల పురోగతి

● పైలట్‌ ప్రాజెక్టు మండలం సైదాపూర్‌లో 1,798 దరఖాస్తులు ● రెండు బృందాలుగా పరిశీలన ● పరిష్కరిస్తున్న అధికారులు

కరీంనగర్‌ అర్బన్‌:

దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలకు విముక్తి కలగనుంది. కార్యాలయాల చుట్టూ దస్త్రాలతో తిరగడం నిరాశగా వెనుదిరగడం ఇన్నా ళ్లు జరిగిన ఉదంతాలు కాగా.. తాజాగా భూ భారతి సదస్సులు పరిష్కారానికి వేదికవుతున్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం భూ భారతిని తెరపైకి తీసుకురాగా.. పెండింగ్‌ సమస్యలపై ప్రత్యేక దృష్టిసారించింది. జిల్లాలో పైలట్‌ ప్రాజెక్ట్‌గా సైదాపూర్‌ మండలాన్ని ఎంపిక చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో ఈ నెల 5నుంచి 20వరకు దరఖాస్తులను స్వీకరించగా రెండు బృందాలుగా సదస్సులు నిర్వహించారు. కలెక్టర్‌ పమేలా సత్పతి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుండగా దస్త్రాల పరిశీలన వేగవంతంగా సాగుతోంది. గతంలో లేని విధంగా చట్టంలో వివిధ మాడ్యూళ్లలో భూ సమస్యల పరిష్కారానికి నూతనంగా కొన్ని అవకాశాలు కల్పించినట్లు అధికారులు చెబుతున్నారు.

1,798 దరఖాస్తులు

సైదాపూర్‌ మండలవ్యాప్తంగా 1,798 దరఖాస్తులు అందాయి. సాదాబైనామాతో భూమి హక్కుల కో సం, పాసుపుస్తకాల్లో తప్పులు, పాత పాసుపుస్తకం నుంచి కొత్తదాంట్లో భూమి నమోదుకాలేదని, విస్తీ ర్ణం, భూమి స్వభావం, హక్కు రకం తదితర అంశాల్లో సమస్యలున్నాయని తెలుస్తోంది. ప్రభుత్వ భూ ములు, అసైన్డ్‌ భూముల హక్కుల నమోదుకు అర్జీ లు అందాయి. పెండింగ్‌ మ్యుటేషన్‌, డీఎస్‌ పెండింగ్‌, భూ విస్తీర్ణంలో తేడాలు సరిచేయడం, నిషేధి త జాబితా నుంచి తొలగించడం, ఇనామ్‌– ఓఆర్సీ జారీ చేయడం, వారసత్వ భూ మార్పిడి, భూ సేకరణకు అర్జీలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. వీటిని రెవెన్యూ అధికారులు క్రోడీకరించి మాడ్యూళ్ల వారీగా విడదీశారు. దరఖాస్తుల పరిశీలనకు క్షేత్రస్థాయిలో ప్రణాళిక రూపొందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement