
గుప్త నిధుల కోసం తవ్వకాలు
తిమ్మాపూర్: రామకృష్ణకాలనీ శివారులో లోయర్ మానేరు జలాశయం పరిధిలోని ఎస్సారెస్పీ స్థలంలో జరుగుతున్న తవ్వకాలు అనుమానాలకు తావిస్తున్నాయి. తాపాల గుట్ట సమీపంలో కొంతకాలంగా జేసీబీతో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆదివారం ఒక మత్స్యకారుడు ఈ తవ్వకాలను గమనించి స్థానికులకు సమాచారమందించాడు. స్థానికులు అక్కడున్న వారిని ప్రశ్నించగా.. గుట్ట సమీపంలో మట్టి పోయడానికి తవ్వుతున్నామని సమాధానమిచ్చారు. అయితే మట్టి కోసం తవ్వకాలైతే సమానంగా తీయకుండా లోతుగా ఎందుకు తవ్వారని గ్రామస్తులు నిలదీశారు. దీంతో సమాధానం చెప్పకుండానే జేసీబీతోపాటు అక్కడి వ్యక్తులు వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు గ్రామంలో చర్చనీయాంశంగా మారాయి.
విచారణ చేయాలి
అనుమానాస్పద తవ్వకాలపై పోలీసులు విచారణ చేయాలని రామకృష్ణకాలనీ గ్రామస్తులు కోరుతున్నారు. గుప్త నిధుల కోసం జరుగుతున్న ఈ కార్యకలాపాలు చట్టవిరుద్ధమని, దీనిపై అధికారులు తక్ష ణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
భక్తుడికి సెల్ఫోన్ అందజేత
ధర్మపురి: దైవ దర్శనం కోసం వచ్చిన ఓ భక్తుడు దేవాలయంలో తన సెల్ఫోన్ పోగొట్టుకోగా సెక్యూరిటీ సిబ్బందికి దొరికింది. ఈవో చేతుల మీదుగా బాధితుడికి అందజేశారు. జగిత్యాల జిల్లాలోని కథలాపూర్ గ్రామానికి చెందిన తొగుట లక్ష్మినారాయణ ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి లక్ష్మినృసింహస్వామి దర్శనం కోసం వచ్చారు. దర్శన సమయ ంలో జేబులో ఉన్న సెల్ఫోన్ పోగొట్టుకోగా.. సె క్యూరిటీ గార్డు బీరయ్యకు దొరికింది. ఈవో శ్రీనివాస్కు అప్పజెప్పగా.. భక్తుడికి అందజేశారు. సెల్ వి లువ రూ.12వేలుంటుందని కృతజ్ఞతలు తెలిపారు.

గుప్త నిధుల కోసం తవ్వకాలు