అల్ఫోర్స్‌ చైర్మన్‌కు ‘రఘునాథం’ అవార్డు | - | Sakshi
Sakshi News home page

అల్ఫోర్స్‌ చైర్మన్‌కు ‘రఘునాథం’ అవార్డు

May 26 2025 9:56 AM | Updated on May 26 2025 9:56 AM

అల్ఫోర్స్‌ చైర్మన్‌కు ‘రఘునాథం’ అవార్డు

అల్ఫోర్స్‌ చైర్మన్‌కు ‘రఘునాథం’ అవార్డు

కొత్తపల్లి: రాష్ట్ర విద్యారంగంలో 35 ఏళ్లుగా అత్యుత్తమ ఫలితాలను సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నందుకు గాను అల్ఫోర్స్‌ విద్యాసంస్థల అధినేత, వీఎన్‌ఆర్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు డా.వి.నరేందర్‌రెడ్డికి వై.రఘునాథం ఎక్స్‌లెన్సీ అవార్డును అందుకున్నారు. కరీంనగర్‌ శివారులోని ఓ ప్రైవేటు వేడుక మందిరంలో ఆదివారం వెంకట్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక వేడుకలో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ, ఫౌండేషన్‌ చైర్మన్‌ వెంకట్‌ ఆయనకు అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర విద్యారంగానికి మార్గదర్శకంగా నిలుస్తూ.. ఎంతోమంది విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందిస్తూ.. అల్ఫోర్స్‌ విద్యాసంస్థల ద్వారా అత్యుత్తమ విద్యనందిస్తూ.. తెలంగాణ రాష్ట్ర విద్యారంగాల్లో సమూలమైన మార్పులు తెస్తున్నందుకు గాను అవార్డు ప్రదానం చేసినట్లు తెలిపారు. డా.వీఎన్‌ఆర్‌ మాట్లాడుతూ.. ఈ అవార్డు బాధ్యత పెంచిందని, సిబ్బంది, తల్లిదండ్రులకు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement