
ఫుట్పాత్ ఆక్రమణలు తొలగింపు
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని ఫుట్పాత్లు, రోడ్లు ఆక్రమించి చేస్తు న్న వ్యాపారాలపై ఎట్టకేలకు నగరపాలకసంస్థ, ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించారు. ‘నడక దారేది?’ శీర్షికన ఈ నెల 20వ తేదీన ‘సాక్షి’లో వచ్చిన కథనానికి స్పందించిన అఽధికారులు మంగళవారం ఆక్రమణలు తొలగించారు. శనివారం అంగడి చౌరస్తా, రాజీవ్ చౌక్, టవర్సర్కిల్, కూరగాయల మార్కెట్ ప్రాంతాల్లో ఫుట్పాత్లు, రోడ్లను ఆక్రమించుకొని వ్యాపారం చేస్తున్న దుకాణదారుల సామగ్రిని తొలగించారు. అహ్మద్పురలో రోడ్డుపైకి వచ్చి చేపట్టిన శాశ్వత నిర్మాణాన్ని కూల్చివేశారు. షెడ్ను పూర్తిగా తొలగించుకోవాలని వ్యాపారులను ఆదేశించారు. ఈ సందర్భంగా దుకాణదారులు నగరపాలకసంస్థ సిబ్బందితో వాగ్వాదానికి దిగగా, పోలీసులు జోక్యం చేసుకొన్నారు.
మళ్లీ ఆక్రమణలు లేకుండా చూడాలి
టవర్సర్కిల్, రాజీవ్చౌక్ లాంటి అత్యంత రద్దీ ప్రాంతాల్లో రోడ్లు, ఫుట్పాత్లు ఆక్రమించి వ్యాపారాలు చేస్తుండడం సర్వసాధారణంగా మారింది. అప్పుడప్పుడు అధికారులు దాడులు చేసి ఆక్రమణలు తొలగిస్తున్నా, నాలుగైదు రోజుల్లో పరిస్థితి మళ్లీ మొదటికొస్తుంది. అలా కాకుండా ఫుట్పాత్, రోడ్ల ఆక్రమణలపై క్రమంతప్పకుండా చర్యలు తీసుకొని, ఆక్రమణలు లేకుండా చూడాలని నగరవాసులు కోరుతున్నారు.

ఫుట్పాత్ ఆక్రమణలు తొలగింపు