సెల్‌ఫోన్ల రికవరీలో జిల్లాకు ప్రథమ స్థానం | - | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్ల రికవరీలో జిల్లాకు ప్రథమ స్థానం

May 29 2025 7:27 AM | Updated on May 29 2025 7:27 AM

సెల్‌ఫోన్ల రికవరీలో జిల్లాకు ప్రథమ స్థానం

సెల్‌ఫోన్ల రికవరీలో జిల్లాకు ప్రథమ స్థానం

కామారెడ్డి క్రైం: సెల్‌ఫోన్ల రికవరీలో జిల్లా ప్రథమ స్థానంలో ఉందని ఎస్పీ రాజేష్‌ చంద్ర తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. ఎవరైనా సెల్‌ఫోన్‌ పోగొట్టుకుంటే ఆందోళనకు గురికావద్దన్నారు. సీఈఐఆర్‌ పోర్టల్‌ ద్వారా రికవరీ చేయడానికి అవకాశం ఉందని పే ర్కొన్నారు. జిల్లాలో వారం రోజులుగా చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌లో పోగొట్టుకున్న, చోరీకి గురైన 107 సెల్‌ఫోన్‌లను రికవరీ చేసినట్లు తెలిపారు. వాటి విలువ దాదాపు రూ.15 లక్షలు ఉంటుందన్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 3,150 సెల్‌ఫోన్‌లను రికవరీ చేశామని వెల్లడించారు. దీంతో రాష్ట్రంలోని కమీషనరేట్‌లను మినహాయిస్తే కామారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. ఎవరైనా సెల్‌ఫోన్‌ పోగొట్టుకుంటే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు వెంటనే పాత సిమ్‌ కార్డును బ్లాక్‌ చేయించాలని సూచించారు. రికవరీలో ప్రతిభ కనబరిచిన పోలీసులను ఎస్పీ అభినందించారు. రికవరీ చేసిన ఫోన్లు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి ఆర్‌ఎస్సై బాల్‌రాజు (8712686114)ను సంప్రదించి ఫోన్లు తీసుకెళ్లాలని సూచించారు.

107 మొబైల్‌ ఫోన్లు రికవరీ చేశాం

ఎస్పీ రాజేష్‌ చంద్ర వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement