లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి

May 29 2025 7:27 AM | Updated on May 29 2025 7:27 AM

లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి

లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి

కామారెడ్డి క్రైం: రాజీవ్‌ వికాసం పథకంలో రూ.50 వేలు, రూ.లక్ష రుణాలకు లబ్ధిదారుల ఎంపిక బుధవారం లోగా పూర్తిచేయాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో బుధవారం ఎంపీడీవోలు, ఏపీఎంలు, ఏపీవోలతో రాజీవ్‌ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు, వన మహోత్సవం, ఉపాధి హామీ పథకంలో జల సంరక్షణ పనులు తదితర అంశాలపై సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. జల సంరక్షణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. వనమహోత్సవం కార్యక్రమానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చందర్‌ నాయక్‌, డీఆర్‌డీవో సురేందర్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ దయానంద్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement