
వాహనాల ఇన్సూరెన్స్ చెల్లించేందుకు చర్యలు
కామారెడ్డి టౌన్ : కా మారెడ్డి బల్దియాలో చె త్త తరలింపునకు విని యోగించే వాహనాలకు సంబంధించిన బీమా చెల్లించేందుకు అధికారులు చర్యలు చేపట్టా రు. ఈ వాహనాలకు సంబంధించి బీమా రె న్యువల్ గడువు దాటి ఏడాది కావస్తోంది. ఈ విషయమై ఈనెల 10వ తేదీన ‘సాక్షి’లో ‘కార్మికులకు లేదు ధీమా’ శీర్షికన ప్రచురితమైన కథనంపై మున్సిపల్ అధికారులు స్పందించారు. వాహనాలకు ఇన్సూరెన్స్ చెల్లింపు ప్రక్రియను బుధవారం ప్రారంభించారు. బ ల్దియాకు సంబంధించిన సానిటేషన్ విభాగంలోని చెత్త సేకరణ ఆటోలు, ట్రాక్టర్ల ఇ న్సూరెన్స్ ప్రీమియం చెల్లించడానికి సంబంధించిన పత్రాలను సిద్ధం చేస్తున్నారు. వా రంలోపు అన్ని వాహనాల ఇన్సూరెన్స్ చెల్లిస్తామని బల్దియా కమిషనర్ రాజేందర్రెడ్డి ‘సాక్షి’తో తెలిపారు.
కామారెడ్డి ఆర్డీవోగా వీణ
కామారెడ్డి క్రైం : కామారెడ్డి ఆర్డీవోగా వీణ నియమితులయ్యారు. గతంలో ఇక్కడ ఆర్డీవోగా పని చేసిన రంగనాథరావు నెల క్రితం ఉద్యోగ విరమణ పొందారు. అప్పటి నుంచి రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ ఇన్చార్జి బాధ్యతలు చూసుకుంటున్నారు. తాజాగా ప్రభుత్వం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మైనారిటీ కార్పొరేషన్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న వీణను కామారెడ్డి ఆర్డీవోగా బదిలీ చేసింది. ఆమె బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
పీఎం ఇంటర్న్షిప్ దరఖాస్తు
గడువు పొడిగింపు
కామారెడ్డి అర్బన్ : ప్రధాన మంత్రి ఇంటర్న్ షిప్ పథకం రెండో దశ దరఖాస్తు గడువును ఈనెల 31 వరకు పొడిగించారు. ఈ విషయాన్ని జిల్లా పరిశ్రమల అధికారి మల్సూర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కు టుంబంలో ప్రభుత్వ ఉద్యోగం లేని 21 నుంచి 24 ఏళ్లలోపు వయసు వారు, పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీలలో ఏ దైనా పూర్తి చేసినవారు ఈ పథకానికి అర్హుల ని పేర్కొన్నారు. కుటుంబ వార్షికాదాయం రూ. 8 లక్షలలోపుగల వారు దరఖాస్తు చేసు కోవాలని, ఇంటర్న్షిప్నకు ఎంపికై న వారికి నెలకు రూ. 5 వేల భత్యం అందిస్తారని తెలిపారు. ఇతర వివరాలకు 1800 11 6090 నంబర్లో లేదా పీఎం ఇంటర్న్షిప్ వెబ్సైట్ లో సందర్శించాలని సూచించారు.
ఇంటర్ పరీక్షలకు
207 మంది గైర్హాజరు
కామారెడ్డి టౌన్: జిల్లాలో బుధవారం ఇంట ర్ ద్వితీయ సంవత్సరం వార్షి పరీక్షలు ని ర్వహించారు. జిల్లాలోని 38 కేంద్రాలలో 8,495 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా.. 8,288 మంది మాత్రమే పరీక్ష రా శారు. 207 మంది గైర్హాజరయ్యారు. జనరల్ గ్రూప్లలో 7,505 మంది విద్యార్థులకు గా ను 7,351 మంది, వొకేషనల్ కోర్సులలో 990 మందికిగాను 937 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. జిల్లా ఇంటర్ నోడల్ అధి కారి షేక్ సలాం పరీక్షలను పర్యవేక్షించారు.
‘నిజాంసాగర్ ప్రాజెక్టు
కెనాల్ వైపు వెళ్లొద్దు’
నిజాంసాగర్: యాసంగి పంటల అవసరాల నిమిత్తం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్ర ధాన కాలువకు నీటిని విడుదల చేస్తున్నందు న ఎవరూ కెనాల్వైపు వెళ్లవద్దని నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్ సూచించారు. గు రువారం నీటిని విడుదల చేయనున్నట్లు తె లిపారు. ప్రధాన కాలువలో నీటి ప్రవాహం అధికంగా ఉండనున్న నేపథ్యంలో కాలువలోకి వెళ్లి ప్రమాదాలను కొనితెచ్చుకోవద్దని సూచించారు.
మార్కెట్యార్డుకు వరుస సెలవులు
సుభాష్నగర్: నగరంలోని శ్రద్ధానంద్ గంజ్కు వరుస సెలవులు ప్రకటించినట్లు సెలక్షన్ గ్రేడ్ సెక్రెటరీ అపర్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 14న హోలీ, 15న దల్హండి, 16న ఆదివారం కావడంతో మార్కెట్ యార్డులో ఎలాంటి క్రయవిక్రయాలు జరగవని పేర్కొన్నారు. రైతులు పంట దిగుబడులను మార్కెట్ యార్డుకు తీసుకురావొద్దని సూచించారు. 17వ తేదీ నుంచి యథావిధిగా మార్కెట్ యార్డులో క్రయవిక్రయాలు కొనసాగుతాయని తెలిపారు.

వాహనాల ఇన్సూరెన్స్ చెల్లించేందుకు చర్యలు