రైతులకు న్యాయం చేయాలి | - | Sakshi
Sakshi News home page

రైతులకు న్యాయం చేయాలి

Jun 1 2025 1:02 AM | Updated on Jun 1 2025 1:02 AM

రైతుల

రైతులకు న్యాయం చేయాలి

గద్వాల: సీడు పత్తి రైతులపై జరుగుతున్న దోపిడీని అరికట్టాలని, రైతు పండించిన సీడుపత్తి ధరను పెంచి ఫెయిలైన విత్తనాలను రీశాంపిల్‌కు పెట్టాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు గొంగళ రంజిత్‌కుమార్‌, బుచ్చిబాబు డిమాండ్‌ చేశారు. శనివారం సీడుపత్తి రైతులతో ర్యాలీగా వచ్చి కలిసి కలెక్టరేట్‌ ఎదుట మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీడుపత్తి రైతులను ఆర్గనైజర్లు, సీడుపత్తి కంపెనీలు మోసం చేస్తున్నాయన్నారు. కంపెనీల నుంచి వచ్చే ప్రయోజనాలను దళారులుగా ఉన్న ఆర్గనైజర్లే దోచేస్తూ రైతులను నట్టేట ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు పంటలు సాగుచేసేముందు అడ్వాన్స్‌ రూపంలో ఇచ్చే పెట్టుబడిని బాకీల కింద లెక్కకట్టి వాటికి వడ్డీలు వేసి పంటలు వచ్చిన తరువాత రైతుల వద్ద నుంచి ముక్కుపిండి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. రైతులు పండించిన సీడుపత్తి విత్తన పాకెట్‌ ధరలను పెంచాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో ఆర్గనైజర్లు చేస్తున్న దోపిడీకి అడ్డుకట్ట వేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం అదనపు కలెక్టర్‌ వి.లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రంగస్వామి, వెంకట్రాములు, జమ్మన్న, శ్రీనివాస్‌, బలరాం, గోవిందు, విష్ణు, ప్రేమ్‌కుమార్‌, దయాకర్‌, ఆంజనేయులు, రైతులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌ ఎదుట

మోకాళ్లపై నిలబడి నిరసన

రైతులకు న్యాయం చేయాలి 
1
1/1

రైతులకు న్యాయం చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement