హామీలను నెరవేర్చాలి | - | Sakshi
Sakshi News home page

హామీలను నెరవేర్చాలి

Sep 22 2025 7:04 AM | Updated on Sep 22 2025 7:04 AM

హామీలను నెరవేర్చాలి

హామీలను నెరవేర్చాలి

రేగొండ: కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎమ్మార్పీఎస్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ మడిపల్లి శ్యాంబాబు అన్నారు. ఆదివారం మండలంలోని రంగయ్యపల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్‌ మండల ఇన్‌చార్జ్‌ దోర్నాల రాజేందర్‌ ఆధ్వర్యంలో దివ్యాంగుల, చేయూత పెన్షన్‌దారుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో దివ్యాంగులు, చేయూత పెన్షన్‌దారులకు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్‌లను పెంచాలని లేనియెడల పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 24న మండలకేంద్రంలో నిర్వహిస్తున్న సన్నాహక సభకు మందకృష్ణ మాదిగ రానున్నట్లు తెలిపారు. ఈ సభకు అధిక సంఖ్యలో పెన్షన్‌దారులు, కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర నాయకులు అంబాల చంద్రమౌళి, నాయకులు నోముల శ్రీనివాస్‌, మంద తిరుపతి, ఎర్ర భద్రయ్య, ఆరెపల్లి రాజు, కొండమల్ల విష్ణు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement