
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
● జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి మల్లీశ్వరి
రేగొండ: పోషక విలువలు గల ఆహరం తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి మల్లీశ్వరి అన్నారు. శనివారం మండలంలోని మడతపల్లి ఉన్నత పాఠశాలలో ఐసీడీఎస్ సూపర్వైజర్ సుజాత ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లీశ్వరి మాట్లాడుతూ.. పోషకాహార లోపం సమాజాభివృద్ధికి అడ్డంకిగా మారిందన్నారు. ప్రతి అంగన్వాడీ టీచర్ తన పరిధిలోని బాలింతలు, గర్భిణులకు ఆరోగ్యకరమైన ఆహారం ప్రాముఖ్యతను తెలియజేయాలన్నారు. పోషణలోపం లేని సమాజం నిర్మించడానికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయరాలు లక్ష్మి, ఎంపీపీఎస్ ప్రధానోపాధ్యాయుడు భద్రయ్య, చైల్డ్ కో ఆర్డినేటర్ తిరుపతి, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.