
అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు
జనగామ: ప్రభుత్వం ప్రవేశ పెట్టే సంక్షేమ పథకా లపై అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి, ధాన్యం కొనుగోలు, వ్యవసాయ శాఖపై మంగళవారం మంత్రులు, సీఎస్తో కలిసి కలిసి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సెలవుపై ఉన్న కలెక్టర్ రిజ్వాన్ బాషా క్యాంపు కార్యాలయం నుంచి, అదనపు కలెక్టర్లు రోహిత్సింగ్, పింకేష్కుమార్, జిల్లా ఉన్నతాధికారులు వీసీలో పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలులో కలెక్టర్లు కీలక పాత్ర వహించా లని ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టం జరిగిన రైతులకు ఎకరాకు రూ.10వేల పరిహారం అందించేందుకు నివేదికలను పంపించాలని కలెక్టర్లను కోరారు.
వీసీలో సీఎం, మంత్రులు