
భారీగా గుట్కాల పట్టివేత
జనగామ: జిల్లా కేంద్రంలో గుట్టుచప్పడు కాకుండా అమ్మకాలు చేస్తున్న గుట్కాలను టాస్క్ఫోర్స్ బృందం శనివారం రాత్రి పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్తాన్కు చెందిన గమ్నారామ్ వ్యాపారి జనగామలో స్థిర పడి గుట్కాల వ్యాపారం చేస్తున్నాడు. పక్కా సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ ఏసీపీ ఏ.మధుసూదన్ ఆధ్వర్యంలో ఎస్సై ఎస్.రాజు నేతృత్వంలో తనిఖీ చేపట్టారు. ఆర్ఆర్ పొగాకు 4 వందల ప్యాకెట్లు (రూ.2.40 లక్షలు), జేకె 3,320 రకానికి చెందిన 12 వందల ప్యాకెట్లు(రూ.2.40లక్షలు) మొత్తంగా రూ.4.80 లక్షల విలువ చేసే ప్యాకెట్లతో పాటు వాటిని తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. ఏసీపీ మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు. కాగా రాజస్తాన్కు చెందిన మరో నిందితుడు మలరాంపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. గుట్కా ప్యాకెట్లతో పాటు వాహనాన్ని స్థానిక ఎస్సై చెన్నకేశవులకు అప్పగించారు.