
లక్ష్యం చేరని ఎల్ఆర్ఎస్
జనగామ: అనధికార లేఅవుట్లోని స్థలాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఇచ్చిన 25శాతం రాయితీ గడువు పెంచినా స్థలాల క్రమద్ధీకరణ లక్ష్యం చేరలేదు. లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) రాయితీ గడువు నేటితో ముగి యనుంది. మార్చి 30వ తేదీ వరకు 25 శాతం రాయితీతో ఎల్ఆర్ఎస్కు అవకాశం కల్పించగా, ఈ నెల 2వ నుంచి 30వ తేదీ వరకు రెండోసారి అవకాశం కల్పించారు. ఎల్ఆర్ఎస్ 2025–26 ఆస్తి పన్నుపై 5 శాతం రాయితీ గడువుకు నేడు (బుధవారం) ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది.
ప్రొసీడింగ్ కాపీలు రాకపోవడంతో..
రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన మేర ఎల్ఆర్ఎస్ ల క్ష్యం నెరవేరడం లేదు. రెండుసార్లు అవకాశం ఇచ్చినా ప్రజల నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదు. ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు యజమానులు ముందుకు రావడం లేదు. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించినా.. నేటికి ప్రొసీడింగ్ కాపీలు రాకపోవడం కూడా కొత్తగా ఫీజు చెల్లించాలనుకుంటున్న వారీపై ఎఫెక్టు కనిపిస్తోంది. 2020లో ఎల్ఆర్ఎస్ కోసం రూ.1,000తో 69,710 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 12,469 మంది మాత్రమే తమ ప్లాట్లను క్రమబద్ధీకరించుకున్నారు. వీటిపై రూ.22.82 కోట్ల మేర ఆదాయం సమకూరింది.
ముగియనున్న 5 శాతం రాయితీ
సర్కారు ఖజానాకు ఆదాయం సమకూర్చుకునేందుకు ప్రభుత్వం 2025–26 (ప్రస్తుత) ఆస్తిపన్ను 100 శాతం చెల్లించిన వారికి 5 శాతం రా యితీ కల్పించింది. ఈ అవకాశం నేటితో ముగి యనుంది. జనగామ పట్టణంలో 15,609 అసెస్మెంట్లు ఉండగా, రూ.6.74కోట్ల మేర పన్ను వసూలు చేయాలని డిమాండ్ ఉంది. ఇందులో 5 శాతం రాయితీపై ఇప్పటి వరకు 2,082 మంది రూ.75లక్షల మేర చెల్లించి లబ్ధిపొందారు. కాగా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేందుకు వచ్చే యజమానులకు ప్రొహిబిటెడ్ పరేషాన్ చేస్తోంది. ప్లాట్ల పంచాయితీలో ఫిర్యాదు వెళ్లిన సమయంలో సమీపంలోని అన్నింటినీ ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చారు. ప్రభుత్వం మరో అవ కాశం ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.
ప్లాట్ల క్రమబద్ధీకరణకు ముందుకురాని యజమానులు
నేటితో ముగియనున్న గడువు
జీపీ, పురపాలిక పరిధిలో రూ.22.82కోట్లు వసూళ్లు
మూడు రోజుల నుంచి తిరుగుతున్న..
కళ్లెం రోడ్డులో 1989లో 250 గజాల ప్లాటు కొనుగోలు చే శా. ఎల్ఆర్ఎస్ కోసం గతంలోనే రూ.1,000 రుసుం చె ల్లించా. ప్లాటుకు సంబంధించి మిగతా డబ్బులు చెల్లించి, క్రమబద్ధీకరణ చేసుకుందామంటే ప్రొహిబిటెడ్లో ఉందంటున్నారు. అధికారులు సత్వరమే స్పందించాలి.
– చిటుకుల అంజయ్య,21వ వార్డు, జనగామ

లక్ష్యం చేరని ఎల్ఆర్ఎస్