
లంచం అడిగేవారిని పట్టిస్తే రూ.25వేల గిఫ్ట్
కాజీపేట అర్బన్ : ‘ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామని లంచం అడిగేవారిని నాకు పట్టిస్తే రూ.25వేలు గిఫ్ట్గా ఇస్తాను.. అలాగే సదరు వ్యక్తిని పార్టీ నుంచి బహిష్కరిస్తానని’ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి తెలిపారు. హంటర్రోడ్డులోని అభిరామ్ గార్డెన్స్లో ఆదివారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ప్రారంభించి మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లను పూర్తి పారదర్శకంగా అర్హులకే అందజేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్కరికై నా ఇల్లు మంజూరు చేసిందా అని ప్రశ్నించారు. అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఓర్వడం లేదన్నారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేస్తున్నామని, అందులో 660 పత్రాలు ఇచ్చామని, త్వరలో మిగతావి అందజేస్తానని చెప్పారు. మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు 3వ తేదీన ముగ్గుపోసుకుని నిర్మాణాలు ప్రారంభించి దావతు చేసుకుని తనను ఆహ్వానిస్తే ఆనందంగా వస్తానని తెలిపారు. గత ప్రభుత్వం నిర్మించి పంపిణీ చేయకుండా వదిలేసిన డబుల్ బెడ్రూం ఇళ్ల పని పడతానని, 15 రోజుల్లో అర్హులకు వాటిని అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ, డిప్యూటీ కమిషనర్ రవీందర్, తహసీల్దార్ బావుసింగ్, కార్పొరేటర్లు మామిండ్ల రాజు, జక్కుల రవీందర్యాదవ్, విజయశ్రీ రజాలీ, తోట వెంకన్న, పోతుల శ్రీమాన్, దేవ్రాజ్, సురేష్ పాల్గొన్నారు.
అర్హులందరికీ ఇందిరమ్మ
ఇళ్ల మంజూరు
ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి