అవతరణ వేడుకలకు అతిథులు వీరే! | - | Sakshi
Sakshi News home page

అవతరణ వేడుకలకు అతిథులు వీరే!

May 31 2025 1:00 AM | Updated on May 31 2025 1:00 AM

అవతరణ

అవతరణ వేడుకలకు అతిథులు వీరే!

హనుమకొండకు మంత్రి

కొండా సురేఖ, వరంగల్‌కు

పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

సాక్షిప్రతినిధి, వరంగల్‌: జూన్‌ 2 ఉదయం 10 గంటలకు తెలంగాణ అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథుల జాబితాను శుక్రవారం ప్రకటించింది. హనుమకొండ జిల్లా పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించనున్నారు. వరంగల్‌లో రాష్ట్ర రెవెన్యూశాఖ, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ములుగులో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) జాతీయ పతాకాలను ఆవిష్కరించనున్నారు. అదే విధంగా జయశంకర్‌ భూపాలపల్లిలో టీడీఎఫ్‌డీసీ చైర్మన్‌ పోదెం వీరయ్య, మహబూబాబాద్‌లో ప్రభుత్వ విప్‌ జె.రాంచంద్రునాయక్‌, జనగామలో ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య జాతీయ పతాకాలను ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి జిల్లాకు చెందిన మంత్రులు, ప్రముఖులు తెలంగాణ అమరవీరుల స్మారకచిహ్నాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించాలని, ఆ తర్వాత అతిథులు జాతీయ జెండాను ఆవిష్కరించాలని పేర్కొన్నారు.

అవతరణ వేడుకలకు  అతిథులు వీరే!1
1/1

అవతరణ వేడుకలకు అతిథులు వీరే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement