ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ

May 29 2025 7:21 AM | Updated on May 30 2025 2:22 PM

యలమంచిలి: అడవిపాలెం సచివాలయానికి సమీపంలో ఖాళీ స్థలంలో నిలుపుదల చేసి ఉన్న ట్రాక్టర్‌ను లారీ ఢీకొనడంతో బోల్తా పడింది. ఆ శబ్థానికి చుట్టుపక్కల ఇళ్లలోని వారు బయటకు వచ్చి భయబ్రాంతులకు గురయ్యారు. నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో ప్రమాదం జరిగిన సమయానికి ఎవరూ లేకపోవడం వలన పెను ప్రమాదం తప్పింది. 

అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ విలేకరి ప్రమాద ఘటనను ఫొటో తీయగా లారీ డ్రైవర్‌ దౌర్జన్యానికి దిగాడు. దీనిపై అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా ఆ లారీకి కనీసం నెంబర్‌ ప్లేట్‌ లేకపోవడం విశేషం. నంబర్‌ ప్లేట్‌ లేని లారీతో కూటమి నాయకులు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. పోలీసులతో పాటు మైనింగ్‌, రవాణా శాఖ అధికారులు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నిందితులను శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ 1
1/1

ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement