సివిల్స్‌ ర్యాంకర్‌కు అభినందన | - | Sakshi
Sakshi News home page

సివిల్స్‌ ర్యాంకర్‌కు అభినందన

May 2 2025 12:18 AM | Updated on May 2 2025 12:18 AM

సివిల్స్‌ ర్యాంకర్‌కు అభినందన

సివిల్స్‌ ర్యాంకర్‌కు అభినందన

రాజమహేంద్రవరం రూరల్‌: రాజమహేంద్రవరం కాతేరులోని తమ తిరుమల విద్యాసంస్థలో చదువుకున్న దొమ్మేటి వినయ్‌ సివిల్స్‌లో ఆలిండియా 274వ ర్యాంకు సాధించాడని తిరుమల విద్యాసంస్థల చైర్మన్‌ నున్న తిరుమలరావు తెలిపారు. వినయ్‌ తల్లిదండ్రులు జగదీష్‌, కనకదుర్గ, అన్నయ్య సాయిసంతోష్‌లతో కలిసి క్యాంపస్‌కు గురువారం వచ్చారు. ఈసందర్బంగా నున్న తిరుమలరావు వినయ్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి, దుశ్శాలువాతో సత్కరించారు. తిరుమలరావు మాట్లాడుతూ ఈ విద్యార్థి ఇంటర్మీడియెట్‌ తమ విద్యాసంస్థలో చదివి ఎన్‌ఐటీ దుర్గాపూర్‌లో ఇంజినీరింగ్‌ సీటు సాధించాడన్నారు. బీటెక్‌ చదివిన తరువాత యూపీఎస్‌సీ పరీక్ష రాసి సివిల్స్‌లో ఈర్యాంకు సాధించాడని తెలిపారు. వినయ్‌ మాట్లాడుతూ తిరుమలరావు సర్‌ ఇచ్చిన కౌన్సెలింగ్‌, ఈ క్యాంపస్‌లో చెప్పే విలువలతో కూడిన విద్య తనకు ఎంతగానో ఉపయోగపడ్డాయని అన్నారు. తనకు వచ్చిన ఈ ర్యాంకుకు ఐఆర్‌ఎస్‌ కస్టమ్స్‌లో రావచ్చని, సివిల్స్‌లో మరొక ప్రయత్నం చేసి కలెక్టర్‌ అవ్వాలన్నది లక్ష్యమని తెలిపారు. అకడమిక్‌ డైరెక్టర్‌ జి.సతీష్‌బాబు, ప్రిన్సిపాల్‌ వి.శ్రీహరి వినయ్‌ను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement