
ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలి
రాజంపేట : అన్నమాచార్య యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యోగాలు పొందడమే కాకుండా ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలని యూనివర్సిటీ చాన్సలర్ చొప్పా గంగిరెడ్డి పేర్కొన్నారు. అన్నమాచార్య యూనివర్సిటీలో అచీవర్స్డే –2025ను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయం సాధించాలంటే నిరంతరం కృషి చేయాలన్నారు. ఇందులో తల్లిదండ్రుల పాత్ర గొప్పదన్నారు. ప్లేస్మెంట్ అధికారి సునీల్ అల్లువాడ మాట్లాడుతూ ఎన్నో కంపెనీల్లో విద్యార్థులు ఎంపిక కావడమే కాకుండా, ఇంటర్న్షిప్లో కూడా పాల్గొన్నారన్నారు. ప్రిన్సిపాల్ నారాయణ మాట్లాడుతూ విద్యార్థుల్లో నిబద్ధత, మానవతా విలువలు గర్వించదగ్గవన్నారు. వైస్ చాన్సలర్ డాక్టర్ సాయిబాబారెడ్డి మాట్లాడుతూ యూనివర్సిటీ ఖ్యాతి విద్యార్థుల ప్రతిభపైనే ఆధారపడి ఉంటుందన్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ మల్లికార్జునరావు, ఇండ్రస్టియల్ రిలేషన్స్ అండ్ ప్లేస్మెంట్స్ జేఎన్టీయూ(అనంతపురం) ప్రొఫెసర్ కిరణ్మయి, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ హేమకేశవులు, వివిధ విభాగాల డీన్లు, శాఖాధ్యక్షులు, అధ్యాపకులు, విద్యార్ధులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఏయూ అచీవర్స్డేలో చాన్సలర్ చొప్పా గంగిరెడ్డి