‘పది’టాపర్స్‌కు విమానయానం | - | Sakshi
Sakshi News home page

‘పది’టాపర్స్‌కు విమానయానం

May 2 2025 1:53 AM | Updated on May 2 2025 1:53 AM

‘పది’

‘పది’టాపర్స్‌కు విమానయానం

బెళుగుప్ప: పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించి మండల స్థాయిలో టాపర్స్‌గా నిలిచిన ఐదుగురు విద్యార్థులకు విమానం ఎక్కే అవకాశం దక్కింది. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో ఎంఈఓ మల్లారెడ్డి తన సొంత నిధులతో విమానయాన అవకాశం కల్పిస్తానని గతంలోనే హామీ ఇచ్చారు. ఈ మేరకు మండల టాపర్స్‌గా నిలిచిన వై.ఈశ్వరి (574), టీ.మధుశ్రీ (568), జీ.ఫౌజియా (563), సి.లావణ్య (560), కె.అర్చన (556)లను బెంగళూరు నుంచి విమానంలో హైదరాబాద్‌కు తీసుకువెళ్లి అక్కడ పర్యాటక ప్రాంతాలను చూపించనున్నారు. ఇందుకోసం గురువారం రాత్రే ఎంఈఓ మల్లారెడ్డి విద్యార్థులను తీసుకుని బెంగళూరుకు వెళ్లారు. అంతకుముందు ఆయన మండల టాపర్స్‌తో కలిసి కలెక్టర్‌ వినోద్‌కుమార్‌, ఇన్‌చార్జ్‌ డీఈఓ కృష్టయ్యలను కలిశారు. విద్యార్థుల కుటుంబ నేపథ్యం, సాధించిన మార్కులను వివరించారు. కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ విద్యార్థులను అభినందించారు.

పింఛన్‌ సొమ్ముతో

ఉడాయించిన డిజిటల్‌ అసిస్టెంట్‌

ఎంపీడీఓ ఫిర్యాదుతో

కేసు నమోదు చేసిన పోలీసులు

బెళుగుప్ప: లబ్ధిదారులకు ఇవ్వాల్సిన పింఛన్‌ మొత్తంతో ఓ సచివాలయ ఉద్యోగి పరారు కాగా పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే... బెళుగుప్ప–1 సచివాలయంలో ఉపేంద్ర డిజిటల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. మే నెలకు సంబంధించి తన పరిధిలోని 61 మంది పింఛన్‌దారులకు ఇవ్వాల్సిన రూ.2.76 లక్షలను గురువారం ఉదయం తీసుకున్నాడు. కేవలం ముగ్గురికి మాత్రం పింఛన్‌ పంపిణీ చేసి కనిపించకుండా పోయాడు. అతని సెల్‌ఫోన్‌ స్విచాఫ్‌ వస్తుండటంతో ఎంపీడీఓ లక్ష్మీనారాయణ, సచివాలయ సెక్రటరీ శివరంజని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.2.58 లక్షల సొమ్ముతో ఉపేంద్ర కనిపించకుండా పోయాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శివ తెలిపారు.

కరెంటు బిల్లు కట్టడం ఇక ఈజీ

బిల్లులోనే క్యూఆర్‌ కోడ్‌

స్కాన్‌ చేసి పేమెంట్‌ చేసే అవకాశం

ఉమ్మడి ‘అనంత’లో ఈ నెల నుంచి

ప్రయోగాత్మకంగా అమలు

అనంతపురం టౌన్‌: విద్యుత్‌ బిల్లుల చెల్లింపుల్లో వినియోగదారులు ఇబ్బందులు పడకుండా ఏపీ ఎస్పీడీసీఎల్‌ చర్యలు తీసుకుంది. మే నెలలో నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. విద్యుత్‌ బిల్లులోనే చెల్లించాల్సిన మొత్తానికి క్యూఆర్‌ కోడ్‌ను జత చేశారు. దీంతో వినియోగదారులు ఫోన్‌ పే, గూగుల్‌ పే, పేటీఎం యాప్‌ల ద్వారా క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి విద్యుత్‌ బిల్లులను డిజిటల్‌ పేమెంట్‌ ద్వారా చెల్లించవచ్చు. ఈనెలలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా క్యూఆర్‌ కోడ్‌ విద్యుత్‌ బిల్లులను ప్రయోగత్మకంగా వినియోగదారులకు అందిస్తున్నారు.

‘పది’టాపర్స్‌కు విమానయానం 1
1/1

‘పది’టాపర్స్‌కు విమానయానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement