కార్మికుల పక్షపాతి వైఎస్సార్‌సీపీ | - | Sakshi
Sakshi News home page

కార్మికుల పక్షపాతి వైఎస్సార్‌సీపీ

May 2 2025 1:53 AM | Updated on May 2 2025 1:53 AM

కార్మికుల పక్షపాతి వైఎస్సార్‌సీపీ

కార్మికుల పక్షపాతి వైఎస్సార్‌సీపీ

అనంతపురం కార్పొరేషన్‌: ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కార్మికుల సమస్యల కోసం రాజీలేని పోరాటాలు చేసిన వైఎస్సార్‌సీపీ కార్మికుల పక్షపాతిగా ఖ్యాతి గాంచిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా కార్మికుల సంక్షేమానికి అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్ద పీట వేశారని గుర్తు చేశారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో వైఎస్సార్‌టీయూసీ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ట్రేడ్‌ యూనియన్‌ జెండాను ఆ విభాగం జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడారు. అంగన్‌వాడీలు, మునిసిపల్‌ కార్మిలకు కష్టాన్ని గత గత ప్రభుత్వాలు గుర్తించలేదన్నారు. 2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంగన్‌వాడీ టీచర్లకు రూ.10వేలు, మునిసిపల్‌ కార్మికులకు రూ.18వేల వరకు వేతనాలు పెంచారన్నారు. అంతేకాక వేతనాలను నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తూ వచ్చారన్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ఆర్టీసీను ప్రభుత్వంలోకి విలీనం చేశారన్నారు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ... కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులకు ప్రమాదకర రోజులు వచ్చాయన్నారు. కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయన్నారు. ఓబిరెడ్డి మాట్లాడుతూ.. మే డే విశిష్టతను వివరించారు. ఆటో డ్రైవర్లు, నాయీ బ్రాహ్మణులకు, మత్స్సకారులకు రూ.10వేలు అందించి శ్రమజీవుల పక్షపాతిగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిలిచారన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, మేయర్‌ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌ రెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి ప్రకాష్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్‌ఘర్‌ రిజ్వాన్‌, పార్టీ నగరాధ్యక్షుడు చింతా సోమశేఖరరెడ్డి, రాష్ట్ర నాయకులు పెన్నోబులేసు, కృష్ణవేణి, రహంతుల్లా, అనుబంధ సంఘాల అధ్యక్షులు శ్రీదేవి, వైపీ బాబు, మల్లెమీద నరసింహులు, సీపీ వీరన్న, ఉమాపతి, అమర్‌నాథరెడ్డి, చంద్రశేఖర్‌ యాదవ్‌, శ్రీనివాసనాయక్‌, నాయకులు పామిడి వీరాంజనేయులు, ఉమ్మడి మదన్‌మోహన్‌ రెడ్డి, వెన్నం శివరామిరెడ్డి, కొర్రపాడు హుస్సేన్‌పీరా, అనిల్‌కుమార్‌గౌడ్‌, ఎం.నరేష్‌, కోనా రాజారెడ్డి, కాకర్ల శ్రీనివాసరెడ్డి, మీసాల రంగన్న, పుల్లయ్య, ఇషాక్‌, మార్కెట్‌ ఖాజా, వెన్నపూస రామచంద్రారెడ్డి, శోభాబాయి, శోభారాణి, భారతి, కార్పొరేటర్లు కమల్‌భూషణ్‌, సంపంగి రామాంజినేయులు, ఇషాక్‌, శ్రీనివాసులు, సాకే చంద్రలేఖ, తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement