
వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలి
కై లాస్నగర్: జూన్ మొదటి వారంలో జిల్లాలో నిర్వహించనున్న వనమహోత్సవాన్ని విజయవంతం చే యాలని, ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని డీ ఆర్డీవో రాథోడ్ రవీందర్ సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో ఉపాధిహామీ ఏపీవో లు, ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లతో సమీక్షా సమా వేశం నిర్వహించారు. మండలాల వారీగా నాటాల్సి న మొక్కల లక్ష్యాన్ని ప్రకటించి చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ.. మొక్కలు నాటే స్థలాలను గుర్తించాలని, గుంతలు తవ్వి సిద్ధంగా ఉంచాలని తెలిపారు. ఉసిరి, ఈత, తాటి, ఇప్ప, వెదురు మొక్కలను నర్సరీల్లో సిద్ధంగా ఉంచాలని సూచించారు. నీటి సంరక్షణకు అవసరమైన వ్యక్తిగత, సామాజిక ఇంకుడుగుంతల నిర్మాణాలకు స్థలాలు ఎంపిక చేయాలని తెలిపారు. మంజూరు చేయడంతోపాటు వాటిని గ్రౌండింగ్ చేసే లా చూడాలని పేర్కొన్నారు. ఉపాధిహామీ కూలీల కు రోజుకు రూ.270 కూలీ అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాకు జాతీయ అవార్డు తీసుకువచ్చేలా ‘జల సంచాయ్ జన భగీరథీ’ కార్యక్రమ ఫొటోలను వేగంగా అప్లోడ్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఏపీడీ కుటుంబరావు, కృష్ణారావు, ఏవో గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.