
మంత్రి ‘తుమ్మల’ను కలిసిన ఎమ్మెల్యే
ఆదిలాబాద్: రైతులకు సంబంధించిన జొన్న కొనుగోళ్ల డబ్బులు త్వరగా విడుదల చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. మంత్రి కార్యాలయంలో సోమవారం కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. జొన్న కొనుగోళ్లకు సంబంధించిన డబ్బులు విడుదల కాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. వానాకాలం పంటకు పెట్టుబడి లేక అప్పు చేయాల్సిన దుస్థితి వస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి రైతు భరోసా నిధులు సైతం వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.