
బారులు తీరి.. గోడు వినిపించి
● ప్రజావాణికి వినతుల వెల్లువ ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ రాజర్షి షా
కై లాస్నగర్: పింఛన్ రావడం లేదని ఒకరు.. ఇంది రమ్మ ఇల్లు మంజూరు చేయాలని మరొకరు.. ఉపాధి చూపాలని ఇంకొకరు.. ఇలా వివిధ సమస్యలతో వచ్చిన బాధితులు కలెక్టరేట్లో బారులు తీరారు. సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో కలెక్టర్ రాజర్షి షాతో తమ గోడు వెల్ల బోసుకున్నారు. వారి నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. పెండింగ్లో ఉంచకుండా సత్వరం పరిష్కరించేలా చొరవచూపాలని సంబంధిత అధికారుల ను ఆదేశించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, వి ద్యుత్, మున్సిపల్, జెడ్పీ, రిమ్స్ వంటి తదితర శా ఖలకు సంబంధించి ఈ వారం 123 దరఖాస్తులు అందాయి. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదే వి, ఆర్డీవో వినోద్ కుమార్, జెడ్పీ సీఈవో జితేందర్రెడ్డి, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ వారం బాధితుల్లో కొందరి నివేదన వారి మాటల్లోనే...