
ప్రశాంతంగా ‘నీట్’
ఆదిలాబాద్టౌన్: వైద్యవిద్య కోర్సులో ప్రవేశం కోసం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) ఆదివారం ప్రశాంతంగా ముగి సింది. జిల్లా కేంద్రంలో ఏడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అభ్యర్థులను లోనికి అనుమతించారు. అందరూ నిర్దేశిత సమయానికి ముందుగానే చేరుకున్నారు. ఆయా సెంటర్ల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆయా కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించారు. కాగా, ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రాల్లోకి బ్యాగ్లు, ఆభరణాలు, లోహ, ఎలక్ట్రానిక్ తదితర వస్తువులను అనుమతించమని అధికారులు ముందుగానే ప్రకటించారు. అయితే కొందరు అభ్యర్థులు ఆభరణాలతో రాగా అవి తీసిన తర్వాతే సిబ్బంది వారి ని లోనికి అనుమతించారు.
1,621 మంది హాజరు..
జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఏడు కేంద్రాల్లో 1,659 మంది విద్యార్థులకు గాను 1,621 మంది హాజరయ్యారు. 38 మంది గైర్హాజరయ్యారు. పట్ట ణంలోని బంగారుగూడ తెలంగాణ మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన కేంద్రంలో 360 మందికి గాను 348 మంది హాజరు కాగా, 12 మంది గైర్హాజరయ్యారు. బంగారుగూడ మైనార్టీ రెసిడెన్షియల్లో 264 మందికి గాను 256 మంది హాజరుకాగా, 8 మంది గైర్హాజరయ్యారు. బాలి కల రెసిడెన్షియల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో 240 మందికి గాను 237 మంది హాజరు కాగా, ముగ్గురు గైర్హాజరయ్యారు. ప్రభు త్వ బాలికల పాఠశాలలో 240 మందికి గాను 234 మంది హాజరుకాగా, ఆరుగురు గైర్హాజరయ్యారు. ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో 240 మందికి గాను 236 హాజరు కాగా, నలుగురు గైర్హాజరయ్యారు. ట్రైబల్ వెల్ఫే ర్ రెసిడెన్షియల్ కళాశాలలో 340కి గాను 238 మంది హాజరు కాగా, ఇద్దరు గైర్హాజరయ్యారు. మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల కేంద్రంలో 75 మందికి గాను 72 మంది హాజరు కాగా, ముగ్గురు గైర్హాజరయ్యారు. ఆయా కేంద్రాలను కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యవేక్షించారు. ఏర్పాట్లపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు
ముందుగానే చేరుకున్న విద్యార్థులు
కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీ

ప్రశాంతంగా ‘నీట్’

ప్రశాంతంగా ‘నీట్’