
మందుబాబులపై కొరడా●
● బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన పలువురిపై కేసు ● జిల్లా కేంద్రంలో పోలీసుల విస్తృత తనిఖీలు
ఆదిలాబాద్టౌన్: మందుబా బులపై పోలీసులు కొరడా ఝుళిపించారు. బహిరంగ ప్రదేశాలు, రోడ్ల పక్కన కూ ర్చొని మద్యం తాగే వారిపై కేసులు నమోదు చేశారు. ‘రో డ్లపైనే సిట్టింగ్’ శీర్షికన ‘సాక్షి’లో ఆదివారం కథనం ప్రచురితమైంది. ఈ మేరకు స్పందించిన వన్టౌన్, టూటౌన్ సీఐలు పట్టణంలో విస్తత తనిఖీలు చేపట్టా రు. టూటౌన్ పరిధిలో గల ఆర్అండ్బీ విశ్రాంతి భవనం, రవితేజ హోటల్, పంజా బ్ హోటల్, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో మద్యం తాగుతున్న వారిని పట్టుకున్నారు. 10 మందిపై కేసులు నమోదు చేసినట్లు టూ టౌన్ సీఐ కరుణాకర్రావు తెలిపారు. అలాగే వన్టౌన్ సీఐ సునిల్కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

మందుబాబులపై కొరడా●