
బార్ల ఎంపికకు లక్కీ డ్రా
కై లాస్నగర్: ఆదిలాబాద్ పట్టణంలో గతంలో రెన్యూవల్ కాకుండా మూతపడ్డ మూడు బార్ల స్థానంలో కొత్తవాటి ఏర్పాటు కోసం జిల్లా ఎకై ్సజ్శాఖ ఆధ్వర్యంలో ఇటీవల దరఖాస్తులు స్వీకరించారు. 61 మంది వ్యాపారులు దరఖాస్తు చేసుకున్నారు. వాటి కేటాయింపు కోసం మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో లక్కీ డ్రా ప్రక్రియ నిర్వహించారు. కలెక్టర్ స్వయంగా డ్రా తీసి ఎంపిక చేశారు. నార్నూర్ మండలం భీంపూర్ గ్రామానికి చెందిన జే.విక్రమ్నాయక్, ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్కు చెందిన జైస్వాల్ శుభం, పట్టణంలోని సుందరయ్యనగర్కు చెందిన ఎ.కళ్యాణిలను అదృష్టం వరించింది. ఎంపికైన వారికి కలెక్టర్ చేతుల మీదుగా కేటాయింపు ఉత్తర్వులు అందజేశారు. ఇందులో డీపీఈవో వై.హిమశ్రీ, సీఐలు విజేందర్, అక్బర్ హుస్సేన్, గంగారెడ్డి, ఎస్సై అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
● ముగ్గురికి కేటాయింపు పత్రాలు అందజేత