
అందని ఆరోగ్యశ్రీ
ముగిసిన ‘వసంత’ ఉత్సవాలు
ద్వారకాతిరుమల: క్షేత్ర దేవత కుంకుళ్లమ్మ ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు సోమవారంతో ముగిశాయి. మహిళలు సామూహిక కుంకుమ పూజలు చేశారు.
మంగళవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
వైద్యం కోసం వెళితే డబ్బులు కట్టాలన్నారు
భీమవరంలోని కంటి ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా గతంలో కంటి ఆపరేషన్ చేయించుకున్నాను. రెండో కంటికి ఇబ్బంది ఉండటంతో మళ్లీ ఆరోగ్యశ్రీలో వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చాను. ఆరోగ్యశ్రీ ఓపీ చూడటం లేదని, డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకోవాలని చెప్పారు. నగదు చెల్లించే స్థోమత లేక వైద్యం చేయించుకోలేక పోయాను.
–దమ్ము మంగతాయారు, భీమవరం
సాక్షి, భీమవరం: పేద, మధ్యతరగతి వర్గాలకు అపర సంజీవనిలా ఉన్న ఆరోగ్యశ్రీకి కూటమి ప్ర భుత్వం తూట్లు పొడుస్తోంది. పాత బకాయిలు విడుదల చేయకపోగా, సమస్యను చక్కదిద్దే ప్ర యత్నం చేయకపోవడంతో నెట్వర్క్ ఆస్పత్రులు సమ్మెబాట పట్టాయి. జిల్లాలోని 30 నెట్వర్క్ ఆస్పత్రులకు గాను 19 ఆస్పత్రులు సేవలను నిలుపుచేశాయి. దీంతో వైద్యసేవల కోసం రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
బకాయిలపై నిర్లక్ష్యం
జిల్లాలోని 30 వరకు ప్రైవేట్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) సేవలు అందిస్తున్నాయి. రో జుకు సుమారు 1,500 వరకు ఓపీ నమోదవుతుండగా ఇన్ పేషెంట్లుగా చేరేవారు 500 వరకు ఉంటున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలుచేసింది. క్యాన్స ర్ లాంటి ఖరీదైన జబ్బుల చికిత్సకు పరిమితి లేకుండా సాయం అందించింది. 1,059 చికిత్సల సంఖ్య (ప్రొసీజర్ల)ను 3,257కి పెంచడంతో పాటు కుటుంబానికి రూ.5 లక్షల ఉన్న వ్యయ పరిమితిని రూ.25 లక్షలకు పెంచడం ద్వారా పేదల ఆరోగ్యానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరింత భరోసా కల్పించారు. కాగా కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి ఎసరుపెడుతోంది. ఆస్పత్రులకు బకాయిల విడుదలకు తీవ్ర జాప్యం చేస్తోంది.
సేవలు బంద్ : జిల్లాలోని నెట్వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.150 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీటిలో ఒక్కో ఆస్పత్రికి రూ.2 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్టు యాజమాన్యాలు చెబుతున్నాయి. వీటిని విడుదల చేయాలని నెల రోజుల క్రితం ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది. ప్రభుత్వం స్పందించకపోవడంతో ముందుగా ప్రకటించినట్టుగానే జిల్లాలోని భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురంలోని 19 ఆస్పత్రుల్లో సేవలను నిలుపుచేశారు. తణుకులోని మొత్తం ఆరు నెట్వర్క్ ఆస్పత్రులు సేవలను బంద్ చేయగా భీమవరంలో నాలుగు, తాడేపల్లిగూడెంలో ఐదు, నరసాపురంలో రెండు, పాలకొల్లులో రెండు ఆస్పత్రులు బంద్ చేశాయి. ఆయా ఆస్పత్రుల్లో రోగులకు అవసరమైన సహకారం అందించే ఆరోగ్యశ్రీ హెల్ప్ డెస్క్లలోని ఆరోగ్యమిత్రలు లేకుండా కనిపించాయి.
పేదలకు ఇక్కట్లు
ఆరోగ్యశ్రీపై ఉచిత వైద్యసేవలు పొందేందుకు వచ్చిన రోగులను ఆసుపత్రి సిబ్బంది సొమ్ములు చెల్లించిన వారికే వైద్యం అందుతుందని చెప్పడంతో పేద వర్గాల వారు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు నగదు చెల్లించి వైద్యసాయం పొందగా, చెల్లించే స్థోమత లేక మరికొందరు ఉసురూమంటూ వెనుతిరిగారు. జిల్లాలో మిగిలిన 11 ఆస్పత్రులు కూడా సేవలు నిలుపుదల చేయనున్నట్టు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చాక వైద్యసేవల్ని నిర్వీర్యం చేస్తూ వస్తున్న కూటమి ప్రభుత్వం తమకు ఆరోగ్య భరోసానిస్తున్న ఆరోగ్యశ్రీని మొత్తం ఆపేయాలని చూస్తోందని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బకాయిలు విడుదల చేయడం ద్వారా సేవల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఎటు చూసినా మట్టి మాఫియానే
ద్వారకాతిరుమల మండలం కోడిగూడెం పంచాయతీకి చెందిన బొటుకు కుంట చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. 8లో u
ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసిన నెట్వర్క్ ఆస్పత్రులు
ఆస్పత్రి పట్టణం
యాపిల్ హాస్పిటల్ తణుకు
అవినాష్ ఆర్థో ట్రామా
అండ్ క్రిటికల్ కేర్ భీమవరం
జానకీ హాస్పిటల్ నరసాపురం
గీతా హాస్పిటల్ తణుకు
జ్ఞానానంద ఆఫ్తాల్మిక్
ఇనిస్టిట్యూట్ భీమవరం
మధర్ వన్నినీ హాస్పిటల్ తాడేపల్లిగూడెం
ప్రణవి నర్సింగ్ హోమ్ తాడేపల్లిగూడెం
రాజర్షి హాస్పిటల్స్ భీమవరం
సాయిశ్వేత సూపర్
స్పెషాలిటీ హాస్పిటల్ తణుకు
శేషాద్రి హాస్పిటల్ పాలకొల్లు
శ్రీలక్ష్మి హాస్పిటల్స్ భీమవరం
శ్రీ స్టార్ హాస్పటల్ ఎమర్జెన్సీ
అండ్ క్రిటికల్ కేర్ తాడేపల్లిగూడెం
శ్రీ సూర్య హాస్పిటల్ నరసాపురం
శ్రీ సూర్య నర్సింగ్ హోమ్ పాలకొల్లు
శ్రీసాయి హాస్పిటల్ తణుకు
సుధ హాస్పిటల్ తణుకు
సూర్యతేజ ఆర్థోపెడిక్
మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ తణుకు
ట్రినిటీ హాస్పిటల్స్ తాడేపల్లిగూడెం
యూనియన్ హాస్పిటల్స్ తాడేపల్లిగూడెం
న్యూస్రీల్
ప్రజారోగ్యం బలి
నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు
పాత బకాయిల విడుదల చేయని కూటమి ప్రభుత్వం
సమ్మెలోకి నెట్వర్క్ ఆస్పత్రులు
జిల్లాలోని 19 హాస్పిటల్స్లో సేవలు బంద్
ఖాళీగా ఆరోగ్యశ్రీ హెల్ప్డెస్క్లు
ఉచిత వైద్యం అందక రోగుల ఇక్కట్లు

అందని ఆరోగ్యశ్రీ

అందని ఆరోగ్యశ్రీ