నిర్ణీత గడువులోగా సీఎంఆర్‌ అప్పగించాలి | - | Sakshi
Sakshi News home page

నిర్ణీత గడువులోగా సీఎంఆర్‌ అప్పగించాలి

Sep 25 2025 12:34 PM | Updated on Sep 25 2025 12:34 PM

నిర్ణీత గడువులోగా సీఎంఆర్‌ అప్పగించాలి

నిర్ణీత గడువులోగా సీఎంఆర్‌ అప్పగించాలి

వనపర్తి రూరల్‌: ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా సీఎంఆర్‌ అప్పగించాలని.. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ హెచ్చరించారు. బుధవారం శ్రీరంగాపురం మండలంలోని లక్ష్మి వారాహి, లక్ష్మి నర్సింహ రైస్‌మిల్లులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ధాన్యం నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2024–2025 వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించిన సీఎంఆర్‌ వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని సకాలంలో మిల్లింగ్‌ చేసి ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం సీఎంఆర్‌ను పౌరసరఫరాలసంస్థకు అప్పగించాలని సూచించారు. ఈ తనిఖీలు సీఎంఆర్‌లో జాప్యం, రైతుల ప్రయోజనాలను కాపాడటానికి ఉద్దేశించినవని తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవడానికి మిల్లర్లు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌ జగన్మోహన్‌, డీసీఎస్‌ఓ కాశీవిశ్వనాథ్‌, తహసీల్దార్‌ రాజు, డీటీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement