అధిక వర్షాలతో దెబ్బతిన్న పంట | - | Sakshi
Sakshi News home page

అధిక వర్షాలతో దెబ్బతిన్న పంట

Sep 22 2025 9:54 AM | Updated on Sep 22 2025 9:54 AM

అధిక

అధిక వర్షాలతో దెబ్బతిన్న పంట

పెట్టుబడి ఇలా...

తగ్గిన దిగుబడి..

మొదటిసారికే పరిమితం..

ఎండు, ఆకుమచ్చ తెగులుతో

తగ్గిన దిగుబడి

జిల్లాలో 15,831 ఎకరాల సాగు

ప్రభుత్వం ఆదుకోవాలంటున్న రైతులు

అమరచింత: అధిక వర్షాలు, తెగుళ్లతో పత్తి పంట దెబ్బతిని ఆశించిన దిగుబడి రాక సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ఆశించిన దిగుబడి వస్తుందని ఆశించిన రైతన్నకు అప్పులు, కన్నీరే మిగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూత, పిందెతో పాటు గూడ, కాయలు రాలుతోందని.. వ్యవసాయ అధికారులు సూచించిన మందులు పిచికారీ చేసినా ఏకదాటిగా కురిసిన వర్షాలకు పంటలు పూర్తిగా ఆగమయ్యాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి వర్షాకాలంలో జిల్లావ్యాప్తంగా 15,831 ఎకరాల్లో పత్తి సాగైనట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఎకరాకు సుమారు రూ.35 వేల వరకు పెట్టుబడి అయిందని.. పంట ఎండుముఖం పట్టి ఉన్న కొద్దిపాటి పత్తినైనా సకాలంలో అందుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. వ్యవసాయ కూలీలను ఇతర ప్రాంతాల నుండి రోజుకు రూ.450 కూలి ఇచ్చి కాసిన పత్తిని ఏరి ఇళ్లకు తరలించుకుంటున్నారు.

మండలం విస్తీర్ణం

(ఎకరాల్లో..)

అమరచింత 4,857

ఆత్మకూర్‌ 4,270

మదనాపురం 2,445

పెద్దమందడి 1,570

ఖిల్లాఘనపురం 1,483

కొత్తకోట 535

రేవల్లి 311

గోపాల్‌పేట 145

వనపర్తి 120

పెబ్బేరు 35

ఏదుట్ల 30

చిన్నంబావి 23

పాన్‌గల్‌ 4

శ్రీరంగాపురం 3

పత్తి సాగుకు ఎకరాకు రూ.35 వేలు.. కౌలు రైతులకై తే రూ.45 వేల వరకు పెట్టుబడి అవుతుందని రైతులు చెబుతున్నారు. పొలం దున్నడానికి రూ.2 వేలు, సాలు కొట్టడానికి రూ.2,500, విత్తనానికి రూ.3 వేలు ఖర్చు అవుతుండగా.. కూలీలకు రెండు పర్యాయాలకు రూ.8 వేలు, ఎరువులకు రూ.12 వేలు, మందుల పిచికారీ మూడు పర్యాయాలకు రూ.9 వేల వరకు అవుతుందని వివరించారు. వీటితో పాటు పత్తి ఏరేందుకు అయ్యే ఖర్చు వీటికి రెట్టింపు అవుతుందంటున్నారు.

ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుందన్న అంచనాలతో రైతులు పత్తి సాగు చేశారు. కాసిన పత్తి కాయలు అధిక వర్షాలకు రాలిపోవడం, మిగిలిన కాయల నుంచి వచ్చే పత్తి కేవలం ఎకరాకు 2 క్వింటాళ్ల వరకు మాత్రమే చేతికందే పరిస్థితి నెలకొంది. ఈసారి మార్కెట్‌లో పత్తికి ఆశించిన ధర లేకపోవడంతో వచ్చిన పత్తిని ఇంటికి తరలించి భద్రపర్చుకుంటున్నారు. మార్కెట్‌లో క్వింటాకు రూ.7 వేల వరకు ఉండగా దళారులు కేవలం రూ.5,500 మాత్రమే చెల్లిస్తుండటంతో రైతన్నలు భారీగా నష్టపోతున్నారు. ఎకరాకు రూ.15 నుంచి రూ.20 వేల వరకు నష్టం వాటిల్లుతుందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వాతావరణం అనుకూలిస్తే రెండు, మూడు పర్యాయాలు పత్తి ఏరుకునే అవకాశం ఉండేది. కాని ఈసారి పూర్తిగా దెబ్బతినడంతో ఒకసారి మాత్రమే పత్తి ఏరుకునే వీలుందని రైతులు చెబుతున్నారు.

అధిక వర్షాలతో దెబ్బతిన్న పంట 1
1/2

అధిక వర్షాలతో దెబ్బతిన్న పంట

అధిక వర్షాలతో దెబ్బతిన్న పంట 2
2/2

అధిక వర్షాలతో దెబ్బతిన్న పంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement