రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ దీపావళి శుభాకాంక్షలు

Telangana: Governor Tamilisai CM KCR Diwali Wishes To People - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దీపావళి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సూచిక ఈ దీపాల పండుగ అని పేర్కొన్నారు. ఆధునిక కాలపు దురాచారాలను జయించి, శాంతి, సౌభ్రాతృత్వం, మత సామరస్యంతో కూడిన సమాజాన్ని నిర్మించడానికి ఈ పండుగ స్ఫూర్తి కలిగిస్తుందని తెలిపారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ స్ఫూర్తితో స్వదేశీ తయారీదారుల జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురావడానికి ఈ పండుగ సమయంలో స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రజలందరి జీవితాల్లో వెలుగులు, సంతోషం, శ్రేయస్సు మరింతగా రావాలని ఈ శుభ సందర్భంగా గవర్నర్‌ ప్రార్థించారు. 

ప్రజల జీవితాల్లో ప్రగతి వెల్లివిరియాలి: సీఎం
సాక్షి, హైదరాబాద్‌: దీపా­వళి పర్వదినం సందర్భంగా దేశ ప్రజల­తోపాటు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని దేశ ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకుంటార­ని అన్నారు. అజ్ఞానాంధకారాన్ని పారదోలి జ్ఞానపుకాంతులు ప్రసరింప చేయడమనే త­త్వా­న్ని దీపావళి మనకు నేర్పుతుందని పేర్కొ­న్నారు. తెలంగాణ మాదిరి దేశ ప్రజలందరి జీవితాల్లో ఆనందపు ప్రగతి కాంతులు వెల్లివిరి­యాలని, సుఖ శాంతులతో సిరి సంపదలతో తులతూగాలని సీఎం ఆకాంక్షించారు. బాణా­సంచా వెలిగించే సందర్భంలో ప్రమాదాలకు గురికాకుండా, భక్తి శ్రద్ధలతో పర్యావరణ­హితంగా దీపావళి జరుపుకోవాలని కోరారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top