
క్రీడలపై యువత దృష్టి సారించాలి
జిల్లా క్రీడాశాఖాధికారి వెంకటనర్సయ్య
సిద్దిపేటజోన్: మైదానాలకు యువత రావాలని, అప్పుడే ఉజ్వల భవిష్యత్తు మీ సొంతం అవుతుందని జిల్లా క్రీడల, యువజన శాఖ అధికారి వెంకట నర్సయ్య పిలుపునిచ్చారు. మంగళవారం ప్రొఫెసర్ జయశంకర్ ఫుట్బాల్ గ్రౌండ్లో ఇన్విటేషన్ కప్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియా లాంటి మాధ్యమాలకు యువత దూరంగా ఉండి క్రీడలపై దృష్టి సారించాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఫుట్బాల్ ఆటకు మంచి డిమాండ్ ఉందన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని సూచించారు. అందరి సహకారంతో క్రీడల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. క్రీడల్లో జిల్లాకు మంచి పేరు తెచ్చేలా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తామన్నారు. ఆటల్లో గెలుపు ఓటములను సహజంగా స్వీకరించాలని, క్రీడా స్ఫూర్తితో ఆడాలని సూచించారు. అంతకుముందు కామారెడ్డి, సిద్దిపేట, హుస్నాబాద్, వర్కొల్, రాంరెడ్డి ప్రాంతజట్ల సభ్యులను పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో కోచ్ అక్బర్, జిల్లా అసోసియేషన్ ప్రతినిధి సాజిద్, తదితరులు పాల్గొన్నారు.